Telugu Global
Cinema & Entertainment

మళ్లీ రిపీట్ అవ్వబోతున్న 'నిన్నే పెళ్లాడతా' కాంబో

ఒకప్పుడు తెలుగులో నటిగా మంచి పేరు తెచ్చుకొని గత కొంతకాలంగా తెలుగు తెరకు దూరంగా బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్న సీనియర్ బ్యూటీ టబు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ పై ఆసక్తి చూపుతోంది. తాజాగా టబు, బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వార్తల ప్రకారం నాగార్జున ‘మన్మధుడు 2’ సినిమాలో కూడా టబు […]

మళ్లీ రిపీట్ అవ్వబోతున్న నిన్నే పెళ్లాడతా కాంబో
X

ఒకప్పుడు తెలుగులో నటిగా మంచి పేరు తెచ్చుకొని గత కొంతకాలంగా తెలుగు తెరకు దూరంగా బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్న సీనియర్ బ్యూటీ టబు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ పై ఆసక్తి చూపుతోంది.

తాజాగా టబు, బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆ వార్తల ప్రకారం నాగార్జున ‘మన్మధుడు 2’ సినిమాలో కూడా టబు ఒక ముఖ్య పాత్ర పోషించబోతోందట.

నాగార్జున, టబు ల స్నేహం గురించి చెప్పాలంటే చాలా దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి. ఇద్దరూ కలిసి ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు.

ఇక నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న ‘మన్మధుడు 2’ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందట. ఆ పాత్రకు టబు అయితే కరెక్ట్ గా సూటవుతుందని దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించాలని అనుకుంటున్నారట.

అయితే ఈ పాత్ర కోసం సోనాలి బింద్రే ని అనుకున్నప్పటికీ తర్వాత టబు ని తీసుకుందామని డిసైడ్ అయ్యారట. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ… టబు, నాగార్జున ల మధ్య ఉన్న స్నేహం కోసమైనా టబు ఈ పాత్రకు ఓకే చెబుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతోంది.

First Published:  4 May 2019 12:22 AM GMT
Next Story