Telugu Global
Cinema & Entertainment

'మహర్షి' వేడుక కోసం వేలల్లో అభిమానులు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా అయిన ‘మహర్షి’ మే 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం. మే 1వ తేదీన హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో ‘మహర్షి’ […]

మహర్షి వేడుక కోసం వేలల్లో అభిమానులు
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా అయిన ‘మహర్షి’ మే 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం. మే 1వ తేదీన హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుక జరగబోతుంది.

పీపుల్స్ ప్లాజాలో 18వేల ప్రేక్షకుల కెపాసిటీ ఉంది. కాబట్టి ఈ వేడుకకు వేలల్లో అభిమానులు తరలి రానున్నారని అంటున్నారు.

ఇక ప్రమోషన్స్ పరంగా చూస్తే ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాక ఈ సినిమా నుంచి ఐదు పాటలను విడుదల చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శక నిర్మాతలు.

అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు మూడు విభిన్న అవతారాలలో కనిపించబోతున్నారు.

First Published:  29 April 2019 11:00 PM GMT
Next Story