చంద్రబాబు మనస్తత్వం నాకు తెలుసు....
సొమ్ము ఒకడిది…. సోకు ఒకడిది…. అన్నట్టు కేంద్రం డబ్బులతో చంద్రబాబు జల్సాలు చేస్తున్నాడని, ఆయన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్ , కేసీఆర్, మోడీ లపై విష ప్రచారం చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐ వై ఆర్ కృష్ణారావు అన్నారు. ఈ రోజు వరకు మేనిఫెస్టో రిలీజ్ చెయ్యని పార్టీలకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. చంద్రబాబు మనస్తత్వం నాకు తెలుసని, ప్రజలను ఎలక్షన్ టైం లో కాన్ఫ్యూజ్ చేస్తూ చంద్రబాబు చాలా […]
సొమ్ము ఒకడిది…. సోకు ఒకడిది…. అన్నట్టు కేంద్రం డబ్బులతో చంద్రబాబు జల్సాలు చేస్తున్నాడని, ఆయన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్ , కేసీఆర్, మోడీ లపై విష ప్రచారం చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐ వై ఆర్ కృష్ణారావు అన్నారు.
ఈ రోజు వరకు మేనిఫెస్టో రిలీజ్ చెయ్యని పార్టీలకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. చంద్రబాబు మనస్తత్వం నాకు తెలుసని, ప్రజలను ఎలక్షన్ టైం లో కాన్ఫ్యూజ్ చేస్తూ చంద్రబాబు చాలా సింపుల్ గా అబద్దాలు చెప్పగలడని, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు ఆయన మాట్లాడటం లేదని ఐ వై ఆర్ విమర్శించారు.
పసుపు కుంకుమ అనేది ఇదే చివరిది అని… ఎన్నికలయ్యాక ఇంక డబ్బులు పడవని ఆయన చెప్పారు.
చంద్రబాబు అన్ని కులాలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లు మళ్ళీ చంద్రబాబు గెలిస్తే తీసివేస్తారని… ఎందుకంటే ఇవన్నీ ఎన్నికల కోసం పెట్టిన పథకాలని, ఎన్నికలు కాగానే తీసేస్తాడని చెప్పారు.
ప్రజల ను చంద్రబాబు మోసం చేస్తున్నారని…. చంద్రబాబు కు నాది ఒకే ఒక సూటి ప్రశ్న అంటూ…. పరిశ్రమలకు రాయితీలు ఉన్న ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పగలదా? కాంగ్రెస్ చేత చంద్రబాబు ఆ హామీ ఇప్పించ గలడా? అని నిలదీశారు.
పరిశ్రమలకు రాయితీ లేని హోదా అయినా ప్యాకేజీ అయినా ఒకటేనని ఐ వై ఆర్ కృష్ణా రావు చెప్పారు.
బీజేపీ న్యాయానికి, నిజాయితీ, పారదర్శక పాలనకు కట్టుబడి ఉందని, చంద్రబాబు దేశం మొత్తం తిరిగి ప్రచారం చేస్తే మా బీజేపీ పార్టీకి లాభమే కానీ నష్టం లేదని చెప్పారు. దేశం మొత్తాని చంద్రబాబు జాతకం తెలుసు నని, మీడియా మాత్రమే ఆయనను కాపాడుతుందని ఎద్దేవా చేశారు.