Telugu Global
Cinema & Entertainment

మరో మూడు ప్రాజెక్ట్స్ ని కోల్పోయిన సుకుమార్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబు తో సినిమా కోల్పోయాక కొంత డీలా పడ్డాడని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ అయినప్పటికీ…. అది అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించింది కాదు. కేవలం పీఆర్ టీమ్ ప్రకటించిందే. ఈ లోపు అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ తో పని చేయనున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇవి కూడా సుకుమార్ ని కలవరపెడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఫిలిం నగర్ లో […]

మరో మూడు ప్రాజెక్ట్స్ ని కోల్పోయిన సుకుమార్
X

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబు తో సినిమా కోల్పోయాక కొంత డీలా పడ్డాడని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ అయినప్పటికీ…. అది అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించింది కాదు. కేవలం పీఆర్ టీమ్ ప్రకటించిందే.

ఈ లోపు అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ తో పని చేయనున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇవి కూడా సుకుమార్ ని కలవరపెడుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన తన సొంత బ్యానర్ లో త్వరలో ప్రారంభం కానున్న సినిమాలు ఆగిపోయే పరిస్థితి లో ఉన్నాయట. కుమారి 21 F తర్వాత దర్శకుడు సూర్య ప్రతాప్ తో సుకుమార్ సినిమా ని తీయనున్నట్లు ప్రకటించారు. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తం గా చేయనున్నారు ఈ చిత్రాన్ని.

అయితే ఇప్పుడు హీరో నితిన్ డేట్స్ కేటాయించలేను అని చెప్పాడట. అందుకే ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. అలాగే నాగశౌర్య హీరోగా శరద్ మరార్ తో సుకుమార్ రైటింగ్స్ కలిపి కాశీ విశాల్ దర్శకత్వంలో చేసే చిత్రం చేయాలి అనుకున్న సుకుమార్ ఈ సినిమా ని కూడా ఆపే దిశగా వెళ్తున్నారట.

మైత్రి మూవీస్ తో మూడు సినిమాలు అనుకున్నారు కానీ వాటిల్లో రెండు మాత్రమే ఉంటాయని వినికిడి. ఇటు అభిమానులు సుకుమార్ బ్యాడ్ టైం నుండి త్వరగా బయటకి రావాలని కోరుకుంటున్నారు.

First Published:  3 April 2019 1:30 AM GMT
Next Story