Telugu Global
Cinema & Entertainment

'మన్మధుడు 2' కుటుంబంతో నాగార్జున

2002 లో విడుదలైన ‘మన్మధుడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. నాగార్జున కెరియర్ లో క్లాసికల్ హిట్ గా మిగిలిపోయిన ఈ చిత్రానికి ‘మన్మధుడు 2’ అనే టైటిల్ తో సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. రొమాంటిక్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘మన్మధుడు’ సినిమా […]

మన్మధుడు 2 కుటుంబంతో నాగార్జున
X

2002 లో విడుదలైన ‘మన్మధుడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. నాగార్జున కెరియర్ లో క్లాసికల్ హిట్ గా మిగిలిపోయిన ఈ చిత్రానికి ‘మన్మధుడు 2’ అనే టైటిల్ తో సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు.

రొమాంటిక్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

‘మన్మధుడు’ సినిమా ఎలా ముగించారో, అక్కడి నుంచే ‘మన్మధుడు 2’ కథ మొదలవబోతోంది అని తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున ఈ సినిమాలోని నటీనటులతో ఒక గ్రూప్ ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

“నేను మరియు నా ‘మన్మధుడు 2’ కుటుంబం. చాలా సంతోషంగా ఉంది” అని ఒక ఫొటోను షేర్ చేశారు నాగ్. ఆ ఫొటోలో నాగార్జున తో పాటు, రకుల్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, సీనియర్ నటి లక్ష్మి, ప్రముఖ తమిళ నటి దేవదర్శిని, రావు రమేష్ తదితరులు ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మన్మధుడు’ లాగే ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

First Published:  1 April 2019 9:15 PM GMT
Next Story