Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ కోసం 18 భారీ సెట్లు

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పుడీ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. అవును.. ఈ మూవీ కోసం ఏకంగా 18 భారీ సెట్లు నిర్మించడానికి నిర్ణయించారు. ఈ బాధ్యతల్ని ఆర్ట్ డైరక్టర్ రవీందర్ కు అప్పగించారు. చాన్నాళ్ల కిందటే స్టార్ట్ అయిన ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ ఇటలీలో జరిగింది. సినిమా మొత్తం ఇటలీ బ్యాక్ […]

ప్రభాస్ కోసం 18 భారీ సెట్లు
X

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పుడీ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. అవును.. ఈ మూవీ కోసం ఏకంగా 18 భారీ సెట్లు నిర్మించడానికి నిర్ణయించారు. ఈ బాధ్యతల్ని ఆర్ట్ డైరక్టర్ రవీందర్ కు అప్పగించారు.

చాన్నాళ్ల కిందటే స్టార్ట్ అయిన ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ ఇటలీలో జరిగింది. సినిమా మొత్తం
ఇటలీ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. పైగా 1940ల నాటి ఇటలీ వాతావరణం కావాలి. అందుకే ఏకంగా సెట్స్ నిర్మించాలని నిర్ణయించారు. రామోజీ ఫిలింసిటీతో పాటు, అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ సెట్స్ నిర్మించబోతున్నారు.

గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. జాన్ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ పూర్తయిన వెంటనే జాన్ మూవీ సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

First Published:  31 March 2019 2:58 AM GMT
Next Story