Telugu Global
International

భారతీయ జంటపై దాడి... భర్త మృతి

జర్మనీలో భారతీయ దంపతులపై దాడి జరిగింది. ఈ దాడిలో భర్త చనిపోగా… భార్య తీవ్రంగా గాయపడింది. మ్యూనిక్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. ప్రశాంత్, ఆయన భార్య స్మితాలు మ్యూనిక్ నగరంలో ఉంటున్నారు. వీరిపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో ప్రశాంత్‌ చనిపోయాడు. స్మితా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడి చేసిన వ్యక్తిని న్యూగినీకి చెందిన వలసదారుడిగా గుర్తించారు. ఎందుకు దాడి చేశారన్నది ఇంకా తెలియడం లేదు. దాడిలో ప్రశాంత్ చనిపోయిన విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. ప్రశాంత్‌ సోదరుడు […]

భారతీయ జంటపై దాడి... భర్త మృతి
X

జర్మనీలో భారతీయ దంపతులపై దాడి జరిగింది. ఈ దాడిలో భర్త చనిపోగా… భార్య తీవ్రంగా గాయపడింది. మ్యూనిక్‌ నగరంలో ఈ ఘటన జరిగింది.

ప్రశాంత్, ఆయన భార్య స్మితాలు మ్యూనిక్ నగరంలో ఉంటున్నారు. వీరిపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో ప్రశాంత్‌ చనిపోయాడు. స్మితా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

దాడి చేసిన వ్యక్తిని న్యూగినీకి చెందిన వలసదారుడిగా గుర్తించారు. ఎందుకు దాడి చేశారన్నది ఇంకా తెలియడం లేదు. దాడిలో ప్రశాంత్ చనిపోయిన విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు.

ప్రశాంత్‌ సోదరుడు జర్మనీ వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని…. బాధితుల ఇద్దరు పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలని అక్కడి మన దౌత్యాధికారులను ఆదేశించినట్టు సుష్మా వివరించారు.

First Published:  30 March 2019 9:12 PM GMT
Next Story