Telugu Global
Cinema & Entertainment

రెజీనా కు అందుకే దూరమయ్యాను " సాయి ధరమ్ తేజ్ 

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించగా వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో కూడా కనిపించారు. ఆ సినిమా కూడా హిట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అప్పట్లో పుకార్లు బయటకు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు […]

రెజీనా కు అందుకే దూరమయ్యాను  సాయి ధరమ్ తేజ్ 
X

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించగా వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో కూడా కనిపించారు. ఆ సినిమా కూడా హిట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అప్పట్లో పుకార్లు బయటకు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే వారిద్దరూ కలిసి కనిపించడం మానేసారు.

అయితే తాజాగా ఈ విషయంపై ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. “గతంలో నాకు నా కోస్టార్ కి మధ్య ఏదో ఉంది అంటూ మీడియా పుకార్లను పుట్టించింది. అలాంటి అర్థం పర్థం లేని పుకార్ల వల్ల తన కెరీర్ కి ఏమైనా చెడు జరుగుతుందేమో అని భావించి నేనే తనకు దూరం అయ్యాను. ఆ పుకార్ల వల్ల మా ఇద్దరి మధ్య స్నేహం చెడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అలా చేయాల్సి వచ్చింది. తను నా ఫస్ట్ కోస్టార్. నాకు నా మొట్టమొదటి దర్శకుడు, మొదటి నిర్మాత ఎంత స్పెషలో తను కూడా అంతే స్పెషల్” అని చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్. పేరు చెప్పకపోయినా తన మాటలను బట్టి అది రెజీనా అని అర్థం చేసుకోవచ్చు.

First Published:  26 March 2019 11:27 PM GMT
Next Story