Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ కి చిరాకొచ్చింది !

ప్రభాస్ సాహో తో బిజీ గా ఉన్నాడు. సాహో చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా అనంతరం ప్రభాస్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో ఒక చిత్రం చేయనున్నాడు. రాధా కృష్ణ ఇంతకు ముందు గోపీచంద్ తో మంచి యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ రాధా కృష్ణ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు అని వినికిడి. ప్రభాస్ రాధా కృష్ణ కి […]

ప్రభాస్ కి చిరాకొచ్చింది !
X

ప్రభాస్ సాహో తో బిజీ గా ఉన్నాడు. సాహో చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా అనంతరం ప్రభాస్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో ఒక చిత్రం చేయనున్నాడు.

రాధా కృష్ణ ఇంతకు ముందు గోపీచంద్ తో మంచి యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ రాధా కృష్ణ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు అని వినికిడి.

ప్రభాస్ రాధా కృష్ణ కి సినిమాని మొత్తం ఎమోషనల్ గా తీయాలని చెప్పాడట. అసలు యాక్షన్ జోలికి వెళ్ళడు అని, ఇప్పటికే సాహో లో ఎప్పుడూ చెయ్యని విధంగా యాక్షన్ సన్నివేశాలు చేసాడని, అందుకే బోర్ కొట్టిందని ప్రభాస్ చెప్పాడట.

ఈ కొత్త చిత్రం లో కూడా యాక్షన్ ఉంటె ఫ్యాన్స్ కి బోర్ కొట్టేస్తుందని అందుకే ఎమోషనల్ గా సినిమాని డ్రైవ్ చేయమని రాధా కృష్ణ కి ప్రభాస్ చెప్పాడని టాక్.

ఈ చిత్రం లో ప్రభాస్ ఒక ఆసక్తికరమైన పాత్ర ని పోషిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కి విడుదల కానున్నది.

First Published:  23 March 2019 2:23 AM GMT
Next Story