Telugu Global
Cinema & Entertainment

హైకోర్టు నిర్ణయాన్ని ఉల్లంఘించిన 'మెగా' హీరోయిన్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘చిత్రలహరి’ అనే చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. నివేతా పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ ఇద్దరూ ఈ సినిమాలో హీరోయిన్లు. సినిమాకి సంబందించిన ప్రమోషన్స్‌తో అందరూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ సినిమాలోని హీరోయిన్ నివేతా ఒక కోర్టు ధిక్కార కేసులో ఇరుక్కుంది. ఇటీవల ఆమె మధురైలోని మీనాక్షి ఆలయానికి దర్శనం కోసం వెళ్ళింది. మధురై హైకోర్టు బెంచ్ నిర్ణయం ప్రకారం మీనాక్షి ఆలయంలోకి ఫోన్లు తీసుకొని వెళ్ళకూడదు. అలాగే […]

హైకోర్టు నిర్ణయాన్ని ఉల్లంఘించిన మెగా హీరోయిన్
X

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘చిత్రలహరి’ అనే చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. నివేతా పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ ఇద్దరూ ఈ సినిమాలో హీరోయిన్లు. సినిమాకి సంబందించిన ప్రమోషన్స్‌తో అందరూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

అయితే ఈ సినిమాలోని హీరోయిన్ నివేతా ఒక కోర్టు ధిక్కార కేసులో ఇరుక్కుంది. ఇటీవల ఆమె మధురైలోని మీనాక్షి ఆలయానికి దర్శనం కోసం వెళ్ళింది. మధురై హైకోర్టు బెంచ్ నిర్ణయం ప్రకారం మీనాక్షి ఆలయంలోకి ఫోన్లు తీసుకొని వెళ్ళకూడదు. అలాగే అక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ తియ్యడంపై నిషేధం ఉంది.

కాగా, ఇటీవల నివేతా ఆలయంలోకి ఫోన్‌తో వెళ్లడమే కాకుండా కొన్ని ఫోటోలు కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో భక్తులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలోకి మొబైల్‌తో వచ్చినా గుడి నిర్వాహకులు ఎలా ప్రవేశం కల్పించారని ప్రశ్నిస్తున్నారు.

సామాన్య భక్తులకు ఒక నియమం, సెలెబ్రిటీలకు మరో నియమం ఎలా అమలు పరుస్తారు అని వాళ్ళు దేవాలయ నిర్వహణాధికారులపై మండి పడుతున్నారు. అయితే ఈ విషయం గమనించిన నివేతా వెంటనే ఫోటోలను డిలీట్ చేసి డామేజ్ కంట్రోల్ చేసింది.

కాని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించినందుకు ఆమెపై కేసు పెట్టాల్సిందేనని పలువురు డిమాండ్ చేస్తుండటంతో నివేత చిక్కుల్లో పడింది. మరి ఈ వివాదం నుంచి నివేత ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే.

First Published:  22 March 2019 4:01 AM GMT
Next Story