Telugu Global
NEWS

ఏపీ కాంగ్రెస్‌లో కమ్మలకు టికెట్లు ఇవ్వడం లేదట... అందుకే...

ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే స్థానాలు ఎన్నో తెలియదు గానీ… టికెట్ల విషయంలో మాత్రం రచ్చ జరుగుతోంది. సీనియర్ నేత సుంకర కృష్ణమూర్తి .. విజయవాడలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో గొడవకు దిగారు. ఏపీలో టీడీపీకి మేలు చేసే విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గం వారికి కాంగ్రెస్‌లో టికెట్లు ఇవ్వకపోవడం వెనుక కుట్ర ఉందని కృష్ణమూర్తి ఆరోపించారు. కమ్మవాళ్లకు టికెట్లు ఇస్తే టీడీపీ ఓట్లు చీలుతాయన్న ఉద్దేశంతోనే […]

ఏపీ కాంగ్రెస్‌లో కమ్మలకు టికెట్లు ఇవ్వడం లేదట... అందుకే...
X

ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే స్థానాలు ఎన్నో తెలియదు గానీ… టికెట్ల విషయంలో మాత్రం రచ్చ జరుగుతోంది. సీనియర్ నేత సుంకర కృష్ణమూర్తి .. విజయవాడలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో గొడవకు దిగారు.

ఏపీలో టీడీపీకి మేలు చేసే విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గం వారికి కాంగ్రెస్‌లో టికెట్లు ఇవ్వకపోవడం వెనుక కుట్ర ఉందని కృష్ణమూర్తి ఆరోపించారు.

కమ్మవాళ్లకు టికెట్లు ఇస్తే టీడీపీ ఓట్లు చీలుతాయన్న ఉద్దేశంతోనే టీడీపీకి మేలు చేసే విధంగా కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేశారని ఆయన నిలదీశారు. సీనియర్ నేత కృష్ణమూర్తి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రఘువీరారెడ్డి మౌనంగా ఉండిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది కృష్ణమూర్తిని బయటకు నెట్టేశారు.

First Published:  22 March 2019 7:37 AM GMT
Next Story