Telugu Global
NEWS

మీడియాతో వ్యభిచారం చేయించవద్దు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఉదయం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…. రాధాకృష్ణ బరితెగించి అబద్ధాలు రాస్తున్నాడని, చంద్రబాబు కోసం ఎంతకైనా తెగించి ఇతరులమీద బురద జల్లుతున్నాడని విమర్శించారు. నేను అనని మాటలను కూడా నేను అన్నట్లుగా ప్రసారం చేసి ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసం నన్ను దెబ్బతీస్తున్నాడని…. ఇలాంటి పనులు మానుకోవాలని హితవు చెప్పాడు. నేనేమైనా బ్యాంకులను మోసం చేశానా? ప్రభుత్వాలను […]

మీడియాతో వ్యభిచారం చేయించవద్దు
X

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఉదయం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…. రాధాకృష్ణ బరితెగించి అబద్ధాలు రాస్తున్నాడని, చంద్రబాబు కోసం ఎంతకైనా తెగించి ఇతరులమీద బురద జల్లుతున్నాడని విమర్శించారు.

నేను అనని మాటలను కూడా నేను అన్నట్లుగా ప్రసారం చేసి ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసం నన్ను దెబ్బతీస్తున్నాడని…. ఇలాంటి పనులు మానుకోవాలని హితవు చెప్పాడు.

నేనేమైనా బ్యాంకులను మోసం చేశానా? ప్రభుత్వాలను మోసం చేశానా? భూ కబ్జాలు చేశానా? అలాంటివి ఏమైనా చేసి ఉంటే…. నా గురించి ధైర్యంగా రాయి…. అంతేగాని నామీద అబద్ధాలు రాస్తే ఊరుకోను… నువ్వు ఒక మానసిక రోగివి… అధికారంలో ఉన్నవాళ్ళకు తొత్తుగా ఉంటావు… నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు…. అంతేగాని నా మీద తప్పుడు వార్తలు రాయకు… అని మండిపడ్డాడు.

ఒకప్పుడు నువ్వు “మా అక్షరం-మీ ఆయుధం” అంటూ మీడియా పెట్టావు. కానీ ఆ మీడియాతోనే వ్యభిచారం చేయిస్తున్నావు. నీ చేతిలో మీడియా ఉంది కదా అని అబద్ధాలు రాస్తే సహించేది లేదు. తన మీద తప్పుడు రాతలు రాస్తే ఊరుకోబోనని వార్నింగ్ ఇచ్చాడు పోసాని.

First Published:  21 March 2019 6:10 AM GMT
Next Story