Telugu Global
Health & Life Style

మధుమేహం.... అప్రమత్తతే చికిత్స

మధుమేహం… షుగర్… డయాబెటీస్… పేర్లు ఏమైనా ఈ వ్యాధికి అప్రమత్తతే మందు. ఈ వ్యాధి నెమ్మది నెమ్మదిగా శరీరంలోకి చేరి నిండా ముంచేస్తుంది. భారతదేశంలో అత్యధిక మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఈ షుగర్ వ్యాధి కనుక ఒక్కసారి వచ్చిందంటే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. దీనికి చికిత్స కంటే కూడా అప్రమత్తతే చాలా ముఖ్యమని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఏమిటో తెల్సుకుందాం.. శరీరంలో గ్లూకోజ్ స్దాయిని నిలువరించే క్లోమ గ్రంధి […]

మధుమేహం.... అప్రమత్తతే చికిత్స
X

మధుమేహం… షుగర్… డయాబెటీస్… పేర్లు ఏమైనా ఈ వ్యాధికి అప్రమత్తతే మందు. ఈ వ్యాధి నెమ్మది నెమ్మదిగా శరీరంలోకి చేరి నిండా ముంచేస్తుంది. భారతదేశంలో అత్యధిక మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఈ షుగర్ వ్యాధి కనుక ఒక్కసారి వచ్చిందంటే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. దీనికి చికిత్స కంటే కూడా అప్రమత్తతే చాలా ముఖ్యమని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఏమిటో తెల్సుకుందాం..

  • శరీరంలో గ్లూకోజ్ స్దాయిని నిలువరించే క్లోమ గ్రంధి (ప్యాంక్రియాటిస్) సరిపడా ఇన్సులిన్ ను సరఫరా చేయలేకపోవడమే ప్రధాన కారణం.
  • దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ స్దాయిలు పెరిగి షుగర్ వ్యాధికి దారితీస్తుంది.
  • ఈ వ్యాధికి అప్రమత్తతే మందు తప్ప… దీనిని పూర్తిగా నయం చేసేందుకు మందులు మాత్రం లేవు.
  • డయాబెటీస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 గా విభజించారు.

టైప్ 1: ఇది ఎక్కువగా చిన్నపిల్లలలో కనిపిస్తుంది. వారి శరీరంలో తగినంత ఇన్సూలిన్ తయారు కాకపోవడం వల్ల ఇది వస్తుంది.

టైప్ 2: నూటికి తొంభై శాతం మంది ఈ టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతుంటారు. శరీరంలో ఇన్సూలిన్ తయారైనప్పటికి, శరీరం దాన్ని వినియోగించుకునే శక్తిని కోల్పోతుంది.

టైప్ 3: ఇది గర్భిణులకు వస్తుంది. ప్రసవం ముందు షుగర్ వ్యాధి ఎటాక్ అయినప్పటికి, ప్రసవం తర్వాత తిరిగి గ్లూకోజ్ స్దాయిలు యథాస్థితికి వస్తాయి.

షుగర్ వ్యాధి లక్షణాలు

  • డయాబెటీస్ వ్యాధి సోకిన వారికి చర్మంపై దురదలు పెట్టడం, అరికాళ్లు మంట, విపరీతంగా ఆకలి వేయడం, తరచు మూత్రానికి వెళ్లడం వంటి లక్షణాలు ప్రాధమికంగా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
  • పొరపాటున శరీరంపై దెబ్బ తగిలితే అది ఓ పట్టాన తగ్గదు.
  • సడన్ గా బరువు తగ్గడం కూడా వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు.

ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి…

  • ఈ వ్యాధిని నిర్దారించడానికి రక్త నమూనాను పరీక్షించాలి.
  • ఉదయమే ఎటువంటి ఆహారం కాని, కాఫీ, టీలు వంటివి తీసుకోకుండా రక్తం పరిక్ష చేయించుకోవాలి.
  • ఈ రక్త పరిక్షలో గ్లూకోజ్ స్దాయి 126 కంటే ఎక్కువగా ఉండకూడదు.
  • భోజనం చేసిన రెండు గంటల తర్వాత కూడా రక్త పరీక్ష చేయించుకుంటే, అందులో కూడా గ్లూకోజ్ స్దాయి 170 కంటే తక్కువగానే ఉండాలి.
  • పై విధంగా రక్త నమూనాలు ఉంటే వారికి మధుమేహం లేదు అని చెప్పవచ్చు.
  • రక్త నమూనాలో గ్లూకోజ్ స్దాయిని బట్టి వైద్యులు చికిత్స చేస్తారు.
  • గ్లూకోజ్ స్దాయి చాలా ఎక్కువగా ఉంటే ఇన్సూలిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
  • రక్తంలో గ్లూకోజ్ తో పాటు కొలెస్ట్రాల్, టైగ్లిజరైడ్లు, హైబీపీ వంటి వాటిని కూడా పరీక్షించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి.

మధుమేహాన్ని పూర్తిగా నిర్మూలించలేం కాబట్టి డాక్టర్లు చెప్పిన మందులు వాడుతూ… ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయమం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

First Published:  21 March 2019 1:20 AM GMT
Next Story