Telugu Global
NEWS

కృష్ణా జిల్లాలో బాంబు కలకలం

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బాంబులు బయటపడటం కలకలం రేపుతోంది. రాజకీయపరంగా అత్యంత ఉద్రిక్తంగా ఉండే కృష్ణా జిల్లాలోనే బాంబు వెలుగు చూడటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మచిలీపట్నం మండలం ఇంగ్లీష్‌పాలెం గ్రామంలోని ఒక ఇంటిలో బాంబులు దాచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా ఒక ఇంటిలో దాచిన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. నామినేషన్ల […]

కృష్ణా జిల్లాలో బాంబు కలకలం
X

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బాంబులు బయటపడటం కలకలం రేపుతోంది. రాజకీయపరంగా అత్యంత ఉద్రిక్తంగా ఉండే కృష్ణా జిల్లాలోనే బాంబు వెలుగు చూడటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

మచిలీపట్నం మండలం ఇంగ్లీష్‌పాలెం గ్రామంలోని ఒక ఇంటిలో బాంబులు దాచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా ఒక ఇంటిలో దాచిన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు.

నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న వేళ బాంబులు లభ్యమయిన విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. అసలు బాంబులు ఎందుకు దాచారు..? ఎవరిమీదనైనా దాడి చేయడానికి ప్రణాళిక రచించారా..? అసలు ఎవరి లక్ష్యంగా ఈ దాడి జరుగబోతోందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

First Published:  20 March 2019 12:38 AM GMT
Next Story