Telugu Global
NEWS

టీవీ5 కథనాన్ని ఖండించిన ప్రశాంత్ కిషోర్ టీం...

పలు జాతీయ సర్వే సంస్థలు టీడీపీకి షాక్‌ ఇస్తున్నాయి. ప్రతి సర్వేలోనూ ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందన్న ఫలితాలే వస్తున్నాయి. దాంతో టీడీపీ ఉలిక్కిపడుతోంది. తాజాగా నిన్న టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే వచ్చింది. ఈ సర్వేలో కూడా ఏపీలో వైసీపీకి 22 ఎంపీ స్థానాలు, టీడీపీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కుతాయని వచ్చింది. దాంతో టీడీపీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. దీంతో వెంటనే టీవీ5 చానల్‌ … ప్రశాంత్ కిషోర్ టీం సర్వే అంటూ ఒక సర్వేను హడావుడిగా ప్రసారం […]

టీవీ5 కథనాన్ని ఖండించిన ప్రశాంత్ కిషోర్ టీం...
X

పలు జాతీయ సర్వే సంస్థలు టీడీపీకి షాక్‌ ఇస్తున్నాయి. ప్రతి సర్వేలోనూ ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందన్న ఫలితాలే వస్తున్నాయి. దాంతో టీడీపీ ఉలిక్కిపడుతోంది.

తాజాగా నిన్న టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే వచ్చింది. ఈ సర్వేలో కూడా ఏపీలో వైసీపీకి 22 ఎంపీ స్థానాలు, టీడీపీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కుతాయని వచ్చింది. దాంతో టీడీపీ శ్రేణులు ఢీలా పడిపోయాయి.

దీంతో వెంటనే టీవీ5 చానల్‌ … ప్రశాంత్ కిషోర్ టీం సర్వే అంటూ ఒక సర్వేను హడావుడిగా ప్రసారం చేసింది. ఏపీలో వార్ వన్‌సైడ్ ఏమీ లేదని… హోరాహోరీగా ఉందని కథనంలో వివరించింది.

అయితే తన సంస్థ పేరుతో టీవీ5 ప్రసారం చేసిన కథనాన్ని ప్రశాంత్ కిషోర్ టీం ఖండించింది. టీవీ5 తమ పేరుతో ప్రసారం చేసిన కథనం ఫేక్ అని వెల్లడించింది. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దని సూచించింది.

చంద్రబాబు మీడియా సంస్థలు అంటూ వైసీపీ ఇటీవల పదేపదే ప్రకటిస్తున్న మీడియా సంస్థల జాబితాలో టీవీ5 కూడా ప్రముఖంగా ఉంది.

First Published:  18 March 2019 11:00 PM GMT
Next Story