Telugu Global
NEWS

జనం ఛీ కొడుతున్నారని అటు వెళ్లావా జేడీ?

రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్ని పార్టీల చుట్టూ ఒక రౌండ్ కొట్టి ఆఖరికి జనసేనలో చేరారు. టీడీపీలో ఆయన చేరుతారని ఇటీవల టీడీపీ పత్రిక పెద్ద వార్త రాసింది. దాంతో సోషల్ మీడియాలో మాజీ జేడీపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. చంద్రబాబు బంటు అని ఇంతకాలం వైసీపీ చెప్పిన మాట నిజమేనన్న మాట అని జనం నమ్మే పరిస్థితి వచ్చింది. దీంతో హఠాత్తుగా రూట్ మార్చిన మాజీ జేడీ జనసేనలో చేరిపోయారు. ఈనేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి […]

జనం ఛీ కొడుతున్నారని అటు వెళ్లావా జేడీ?
X

రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్ని పార్టీల చుట్టూ ఒక రౌండ్ కొట్టి ఆఖరికి జనసేనలో చేరారు. టీడీపీలో ఆయన చేరుతారని ఇటీవల టీడీపీ పత్రిక పెద్ద వార్త రాసింది. దాంతో సోషల్ మీడియాలో మాజీ జేడీపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

చంద్రబాబు బంటు అని ఇంతకాలం వైసీపీ చెప్పిన మాట నిజమేనన్న మాట అని జనం నమ్మే పరిస్థితి వచ్చింది. దీంతో హఠాత్తుగా రూట్ మార్చిన మాజీ జేడీ జనసేనలో చేరిపోయారు.

ఈనేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. నేరుగా టీడీపీలో చేరితే జనం ఛీకొడుతారని మాజీ జేడీ జనసేనలో చేరారని వ్యాఖ్యానించారు.

ఇప్పుడే జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మీనారాయణ గారూ… మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే వారేగా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీ కొడుతారని దాని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేశారో, ఇకపై ఏంచేస్తారో తెలియదనుకుంటే ఎలా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

First Published:  18 March 2019 2:30 AM GMT
Next Story