Telugu Global
NEWS

మర్డర్లు నాకు కొత్త కాదు..... రాజకీయం కోసమే మీ ఆడవాళ్ల జోలికి వచ్చా...

అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీలో వర్గపోరు ముదిరింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌కు, మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాకు మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. గతంలో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా పనిచేసిన మధు ఇటీవలే టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన ఆయన సోమవారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, ఆయన కుమారుడు… అక్కడికి వచ్చి మధుసూదన గుప్తాతో వాగ్వాదానికి దిగారు. మొన్ననే పార్టీలో చేరి, ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యాలయంలో ఎవరికి చెప్పి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ  […]

మర్డర్లు నాకు కొత్త కాదు..... రాజకీయం కోసమే మీ ఆడవాళ్ల జోలికి వచ్చా...
X

అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీలో వర్గపోరు ముదిరింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌కు, మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాకు మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. గతంలో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా పనిచేసిన మధు ఇటీవలే టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరిన ఆయన సోమవారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, ఆయన కుమారుడు… అక్కడికి వచ్చి మధుసూదన గుప్తాతో వాగ్వాదానికి దిగారు. మొన్ననే పార్టీలో చేరి, ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యాలయంలో ఎవరికి చెప్పి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ
ప్రశ్నించారు. ఈ సమయంలో మధుసూదన గుప్తా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడే వాడిని కాదన్నారు.

”నన్ను భయపెట్టాలనుకుంటే పప్పులు ఉడకవ్… ఫ్యాక్షన్ మర్డర్లు వాళ్లకు కొత్తేమో, మాకు కాదు. మాది 70 ఏళ్ల నుంచి ఫ్యాక్షన్‌ కుటుంబం అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు…. కానీ అదంతా రాజకీయాంలో భాగమే. మీ ఆస్తులు, ఆడవాళ్ల జోలికి వచ్చానంటే ….అది దురుద్దేశంతో కాదు, మరొకరికి రాజకీయంగా న్యాయం చేసేందుకే” అని మధుసూదన గుప్తా వ్యాఖ్యానించారు.

గుంతకల్లు టికెట్ ఆశిస్తున్న మధుసూదన గుప్తా ఇలా… తనకు మర్డర్లు చేయడం కొత్తకాదు, గతంలో టీడీపీ వారి ఆస్తులు, ఆడవాళ్ల జోలికి వచ్చానంటే అది రాజకీయంలో భాగమేనని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.

First Published:  11 March 2019 8:50 PM GMT
Next Story