Telugu Global
NEWS

నరసరావుపేట ఎంపీగా కన్నా పోటీ

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీలు  అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈసారి లోక్‌సభ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం బీజేపీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం విన్నపం పంపింది. కన్నాకు నరసరావుపేట లోక్‌సభ టికెట్ కేటాయించాని రాష్ట్ర నాయకత్వం కోరింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతోంది. ఈనెల 14 తర్వాత రోజుకు రెండు […]

నరసరావుపేట ఎంపీగా కన్నా పోటీ
X

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈసారి లోక్‌సభ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.

నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం బీజేపీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం విన్నపం పంపింది. కన్నాకు నరసరావుపేట లోక్‌సభ టికెట్ కేటాయించాని రాష్ట్ర నాయకత్వం కోరింది.

ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతోంది. ఈనెల 14 తర్వాత రోజుకు రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అభ్యర్థుల జాబితాపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

First Published:  10 March 2019 8:28 PM GMT
Next Story