Telugu Global
NEWS

ఆ సత్తా జగన్‌కు మాత్రమే ఉంది " రఘురామకృష్టంరాజు

టీడీపీ నేత, పారిశ్రామికవేత్త రఘురామకృష్టంరాజు వైసీపీలో చేరారు. జగన్‌ను లోటస్‌ పాండ్ లో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘురామకృష్టంరాజు… రాష్ట్రంలో తటస్తులు కూడా జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. జగన్‌ కుటుంబంతో తమకు చాలా కాలంగా అనుబంధం ఉందన్నారు. విభజన హామీలు సాధించే సత్తా ఒక్క జగన్‌కు మాత్రమే ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమమన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రజలకు సేవ […]

ఆ సత్తా జగన్‌కు మాత్రమే ఉంది  రఘురామకృష్టంరాజు
X

టీడీపీ నేత, పారిశ్రామికవేత్త రఘురామకృష్టంరాజు వైసీపీలో చేరారు. జగన్‌ను లోటస్‌ పాండ్ లో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన అనుచరులు కూడా వైసీపీలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రఘురామకృష్టంరాజు… రాష్ట్రంలో తటస్తులు కూడా జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. జగన్‌ కుటుంబంతో తమకు చాలా కాలంగా అనుబంధం ఉందన్నారు. విభజన హామీలు సాధించే సత్తా ఒక్క జగన్‌కు మాత్రమే ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమమన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న నిజాయితీ జగన్‌లో కనిపించిందన్నారు.

పాదయాత్ర జగన్‌ను ఒక మంచి నాయకుడిగా మార్చిందన్నారు. పాదయాత్ర ముందు జగన్‌కు… ఇప్పుడు జగన్‌కు పూర్తిగా తేడా ఉందన్నారు. ఈసారి గోదావరి జిల్లాలో వైసీపీకి తిరుగుండదన్నారు.

First Published:  3 March 2019 12:50 AM GMT
Next Story