టీడీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా
తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగు అయిపోయింది. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవగా… సండ్రా వెంకటవీరయ్య ఆపార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తాను టీఆర్ఎస్ చేరుతున్నానని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్తో చర్చలు పూర్తి అయ్యాయని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు సండ్ర. ఇటీవల అసెంబ్లీ […]
తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగు అయిపోయింది. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవగా… సండ్రా వెంకటవీరయ్య ఆపార్టీకి రాజీనామా చేశారు.
టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తాను టీఆర్ఎస్ చేరుతున్నానని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్తో చర్చలు పూర్తి అయ్యాయని చెప్పారు.
తెలంగాణలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి
గెలిచే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు సండ్ర. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున సండ్ర గెలవగానే టీటీడీ బోర్డు సభ్యుడిగా మరోసారి చంద్రబాబు నియమించారు.
అయితే సండ్ర ఆ పదవిని స్వీకరించలేదు. సకాలంలో ప్రమాణస్వీకారం చేయలేదన్న కారణంగా సండ్రను బోర్డు నుంచి తొలగిస్తున్నట్టు ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.