Telugu Global
NEWS

కోట్ల రాక‌తో క‌ర్నూలు టీడీపీలో కొట్లాట !

ఒక కుటుంబం వ‌చ్చింది. మ‌రో కుటుంబం గుర్రుగా ఉంది. కానీ పైకి రెండు కుటుంబాలను చంద్రబాబు క‌లిపార‌ని తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రచారం మొద‌లైంది. కానీ క‌ర్నూలులో కోట్ల కుటుంబం రాక‌తో తెలుగుదేశంలో మాత్రం వేడి మొద‌లైంది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి వారు ప‌క్క చూపులు చూస్తున్నారు. కొడుమూరు స‌భ‌లోనే కోట్ల రాక‌ను వ్య‌తిరేకిస్తూ తెలుగుదేశం త‌మ్ముళ్లు నినాదాలు చేశారు. సాక్షాత్తూ చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఓ కార్య‌క‌ర్త చెప్పు విసిరారు. కోట్ల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేశారు. […]

కోట్ల రాక‌తో క‌ర్నూలు టీడీపీలో కొట్లాట !
X

ఒక కుటుంబం వ‌చ్చింది. మ‌రో కుటుంబం గుర్రుగా ఉంది. కానీ పైకి రెండు కుటుంబాలను చంద్రబాబు క‌లిపార‌ని తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రచారం మొద‌లైంది. కానీ క‌ర్నూలులో కోట్ల కుటుంబం రాక‌తో తెలుగుదేశంలో మాత్రం వేడి మొద‌లైంది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి వారు ప‌క్క చూపులు చూస్తున్నారు.

కొడుమూరు స‌భ‌లోనే కోట్ల రాక‌ను వ్య‌తిరేకిస్తూ తెలుగుదేశం త‌మ్ముళ్లు నినాదాలు చేశారు. సాక్షాత్తూ చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఓ కార్య‌క‌ర్త చెప్పు విసిరారు. కోట్ల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేశారు. మ‌రోవైపు చంద్ర‌బాబు పర్య‌ట‌న‌కు ఎంపీ బుట్టా రేణుక డుమ్మా కొట్టారు. కోట్ల చేరిక‌తో ఆమెకు ఇప్పుడు సీటు డౌటుగా మారింది. దీంతో ఆమె మ‌ళ్లీ వైసీపీలోకి వ‌స్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు పాణ్యం సీటు ఆశిస్తున్న ఏరాసు ప్ర‌తాప్‌రెడ్డి కూడా మీటింగ్‌కు రాలేదు. ఆయ‌న కూడా పార్టీ మారుతార‌ని జోరుగా విన్పిస్తోంది. ఇటు ఆలూరు టీడీపీ నేత వీర‌భ‌ద్ర‌గౌడ్ కూడా అసంతృప్తితో ఉన్నారు. కొడుమూరు ఇంచార్జ్‌గా ఉన్న విష్ణు కూడా పార్టీకి రాంరాం చెప్పే ఆలోచ‌న చేస్తున్నార‌ని తెలుస్తోంది.

మొత్తానికి క‌ర్నూలు రాజ‌కీయాలు వేడెక్కాయి. కోట్ల‌, కేఈ కుటుంబాలు క‌లిశాయో లేదో తెలియ‌దు. పైకి న‌టిస్తున్నారో తెలియ‌దు. ఎన్నిక‌లు వ‌స్తే గానీ ఏ వ‌ర్గం ఎటు వైపు ప‌నిచేసిందో తెలుస్తుంది. అప్ప‌టివ‌ర‌కు రాయ‌ల‌సీమ రాజ‌కీయాల‌ను చూస్తూ ఉండాల్సిందే.

First Published:  2 March 2019 9:02 PM GMT
Next Story