Telugu Global
NEWS

ఒకే పదవి.... కాంగ్రెస్ లో కుమ్ములాట.... లాటరీ మేలేమో!

తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ కోటాలో ఒకే ఒక సీటు దక్కనుంది. దాన్ని కేసీఆర్ దక్కనిస్తాడో లేదో కూడా తెలియడం లేదు కానీ.. ఆ సీటు విషయంలో కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ కనిపిస్తుండటం విశేషం. ముప్పై మందికి పైగా నేతలు ఆ పదవిని సొంతం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారట. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ఓటమి పాలయ్యారు. అలాంటి వాళ్లు అంతా […]

ఒకే పదవి.... కాంగ్రెస్ లో కుమ్ములాట.... లాటరీ మేలేమో!
X

తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ కోటాలో ఒకే ఒక సీటు దక్కనుంది. దాన్ని కేసీఆర్ దక్కనిస్తాడో లేదో కూడా తెలియడం లేదు కానీ.. ఆ సీటు విషయంలో కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ కనిపిస్తుండటం విశేషం.

ముప్పై మందికి పైగా నేతలు ఆ పదవిని సొంతం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారట. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ఓటమి పాలయ్యారు. అలాంటి వాళ్లు అంతా ఇప్పుడు ఆ పదవి మీద దృష్టి సారించారు. ఎవరికి వారు తమకే ఆ పదవి అని అంటున్నారట.

కాంగ్రెస్ దక్కేది ఒక్క ఎమ్మెల్సీ సీటు. దానికి పోటీలో ముప్పై మందికి పైగా నేతలున్నారు. ఎమ్మెల్యేలుగా నెగ్గలేకపోయిన వాళ్లంతా.. ఇప్పుడు ఆ పదవి మీద ఆశలు పెట్టుకున్నారట. మరి వారిలో ఎవరికి ఆ సీటును ఇవ్వాలో అధిష్టానానికి కూడా తేల్చడం అంత ఈజీ కాదు.

ఏ ఇద్దరో ముగ్గురో పోటీ పడుతూ ఉండి ఉంటే అదో లెక్క. పోటీలో ఉన్నది ఏకంగా ముప్పై మంది. వారిలో ఎవరికి సర్ధి చెబుతారు? ఎవరికి ఆ సీటు ఇస్తారు? అనేది ప్రశ్నార్థకమే.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఛాయిస్ లాటరీ తీయడమే అని అంటున్నారు….

అందరి పేర్లూ రాసి.. డబ్బాలో వేసి లాటరీ తీయిస్తే.. ఎవరి పేరు వస్తే వారికి ఆ ఎమ్మెల్సీ సీటును ఇవ్వడం ఈజీ అని పరిశీలకులు అంటున్నారు. అప్పుడు ఎవరికి లక్ ఉంటే వాళ్లకే ఆ ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ ముందున్న మార్గం ఇదే అని అంటున్నారు విశ్లేషకులు.

First Published:  26 Feb 2019 9:14 AM GMT
Next Story