Telugu Global
NEWS

ఎన్టీఆర్‌ బయోపిక్‌, ఎల్లో మీడియాపై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి దర్శకుడు క్రిష్‌పై విరుచుకుపడ్డారు. మణికర్ణిక చిత్రం నుంచి మధ్యలో తప్పుకున్న క్రిష్… అందుకు కంగనారనౌతే కారణమంటూ ఇటీవల పలు మీడియా సంస్థల వద్ద తీవ్ర విమర్శలు చేశారు. ఆమెపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. క్రిష్‌ తప్పుకున్న తర్వాత కంగనా సొంతంగా దర్శకత్వం చేసి మణికర్ణిక చిత్రాన్ని విడుదల చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా హిట్ అయిన తర్వాత కంగనాపై క్రిష్ మరిన్ని తీవ్ర […]

ఎన్టీఆర్‌ బయోపిక్‌, ఎల్లో మీడియాపై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
X

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి దర్శకుడు క్రిష్‌పై విరుచుకుపడ్డారు. మణికర్ణిక చిత్రం నుంచి మధ్యలో తప్పుకున్న క్రిష్… అందుకు కంగనారనౌతే కారణమంటూ ఇటీవల పలు మీడియా సంస్థల వద్ద తీవ్ర విమర్శలు చేశారు. ఆమెపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. క్రిష్‌ తప్పుకున్న తర్వాత కంగనా సొంతంగా దర్శకత్వం చేసి మణికర్ణిక చిత్రాన్ని విడుదల చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

సినిమా హిట్ అయిన తర్వాత కంగనాపై క్రిష్ మరిన్ని తీవ్ర విమర్శలు చేశారు. తాను బంగారం లాంటి సినిమాను తీస్తే కంగనా దాన్ని వెండిలా మార్చేశారని విమర్శించారు. అయితే ఇప్పుడు కంగనాకు టైం వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అవడంతో కంగనా స్పందించారు.

క్రిష్‌కు అంత స్టామినా ఉంటే కథానాయకుడు, మహానాయకుడు పరిస్థితి ఇలా ఎందుకుందని ప్రశ్నించారు. ఎన్టీర్ బయోపిక్‌ కలెక్షన్ల గురించి తాను విన్నానని… అవి జీరో రికవరీగా నిలిచాయన్నారు. ఆ నటుడు( బాలకృష్ణ) జీవితంలో ఈ చిత్రాలు మచ్చగా మిగిలిపోతాయన్నారు. క్రిష్‌ను నమ్మిన బాలకృష్ణను చూస్తుంటే బాధగా ఉందని కంగనా వ్యాఖ్యానించారు. తన వ్యక్తిత్వంపై దాడి చేయడమే కాకుండా.. నిందలు వేస్తూ రాబందుల్లా పీక్కు తిన్న వారు, అనాలోచితంగా విమర్శలు చేసినవారు ఇప్పుడేమంటారు? అని ప్రశ్నించారామె.

క్రిష్‌తో పాటు ఆయనకు వంతపాడుతున్న మీడియా సంస్థలపైనా కంగనా ఫైర్ అయ్యారు. క్రిష్‌తో పాటు కొన్ని పెయిడ్ మీడియా సంస్థలు కూడా తనపై బురదజల్లాయని… అలా చేయడం సిగ్గుచేటన్నారు కంగనా.

First Published:  25 Feb 2019 9:27 AM GMT
Next Story