Telugu Global
NEWS

మర్రి శశిధర్‌ రెడ్డికి వాయింపు....

ఇటీవల చంద్రబాబును కలిసిన మర్రి శశిధర్‌ రెడ్డి… టీడీపీ గెలవాలని కోరుకుని ఉంటే తప్పు పట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అలా కాకుండా జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని కానివ్వకుండా అడ్డుకోండి అని చంద్రబాబును కోరారు మర్రి. ఇదే వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. చెన్నారెడ్డికి కుమారుడై ఉండి చంద్రబాబు వద్దకు వెళ్లి జగన్‌ను గెలవకుండా చూడండి అని విజ్ఞప్తి చేయడం ముమ్మాటికి అసూయ అన్నది వైసీపీ అభిమానుల ఆగ్రహం. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూమారుడు సాధించలేని విధంగా జగన్‌ సొంతంగా పార్టీ పెట్టి… 67 […]

మర్రి శశిధర్‌ రెడ్డికి వాయింపు....
X

ఇటీవల చంద్రబాబును కలిసిన మర్రి శశిధర్‌ రెడ్డి… టీడీపీ గెలవాలని కోరుకుని ఉంటే తప్పు పట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అలా కాకుండా జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని కానివ్వకుండా అడ్డుకోండి అని చంద్రబాబును కోరారు మర్రి. ఇదే వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

చెన్నారెడ్డికి కుమారుడై ఉండి చంద్రబాబు వద్దకు వెళ్లి జగన్‌ను గెలవకుండా చూడండి అని విజ్ఞప్తి చేయడం ముమ్మాటికి అసూయ అన్నది వైసీపీ అభిమానుల ఆగ్రహం. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూమారుడు సాధించలేని విధంగా జగన్‌ సొంతంగా పార్టీ పెట్టి… 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని… అధికార పీఠానికి చేరువతున్నారన్న ఆక్రోశం కూడా మర్రి శశిధర్‌ రెడ్డికి
ఉందన్నది వైసీపీ ఆరోపణ.

ఇప్పుడు వైసీపీ అభిమానులు భారీగా మర్రి శశిధర్‌ రెడ్డికి ఫోన్లు, వాట్సాప్ మేసేజ్‌లు పంపుతున్నారు. జగన్‌ మీకేం ద్రోహం చేశారని…. ఆయనపై అంత ద్వేషం అని ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా మర్రి శశిధర్‌ రెడ్డిని ఫోన్‌లో వాయిస్తున్నారు. ఈ విషయాన్ని మర్రి శశిధర్‌రెడ్డే మీడియాతో చెప్పుకుని వాపోయారు. కంటిన్యూగా ఫోన్లు వస్తూనే ఉన్నాయని
చెప్పారు.

First Published:  21 Feb 2019 9:05 PM GMT
Next Story