Telugu Global
NEWS

జిత్తులమారి బాబుని కనిపెట్టండి: జగన్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిత్తులమారి అని, పార్టీ శ్రేణులు ఆయనను ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను హెచ్చరించారు. వారం రోజుల లండన్ పర్యటనలో ఉన్న జగన్ పార్టీ సీనియర్ నాయకులతో పలు అంశాలపై టెలిఫోన్ లో సంప్రదించినట్టు చెబుతున్నారు. “చంద్రబాబు నాయుడ్ని తక్కువ అంచనా వేయవద్దు. ఆయన దేనికైనా తెగిస్తారు. ఎవరిని […]

జిత్తులమారి బాబుని కనిపెట్టండి: జగన్
X

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిత్తులమారి అని, పార్టీ శ్రేణులు ఆయనను ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను హెచ్చరించారు.

వారం రోజుల లండన్ పర్యటనలో ఉన్న జగన్ పార్టీ సీనియర్ నాయకులతో పలు అంశాలపై టెలిఫోన్ లో సంప్రదించినట్టు చెబుతున్నారు. “చంద్రబాబు నాయుడ్ని తక్కువ అంచనా వేయవద్దు. ఆయన దేనికైనా తెగిస్తారు. ఎవరిని పడితే వారిని నమ్మి పార్టీ విషయాలను వెల్లడించవద్దు” అని జగన్ పార్టీ సీనియర్ నాయకులకు చెప్పినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న వారంతా ఆ పార్టీ పట్ల కోపంతో వచ్చే వారు కాదని, వారిలో కోవర్టులు కూడా ఉంటారని గ్రహించాలని చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నానాటికీ ఆదరణ పెరుగుతోందని, దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఎలాంటి కుట్రలైనా చేస్తారని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పినట్లు సమాచారం.

పార్టీలో ఎవరైనా చేరతామని వస్తే ముందుగా వారి గురించి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవాలని, తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తితోనే వస్తున్నారని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే వారిని పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

రాష్ట్రంలో బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని, ఇతర వర్గాల వారు కూడా అనుకూలంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్త వహించి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని జగన్ అన్నట్లు చెబుతున్నారు.

First Published:  21 Feb 2019 9:44 PM GMT
Next Story