Telugu Global
NEWS

అదే నిజమైతే ముందు యనమల వైసీపీలో చేరే వారు....

చివరకు కుమార్తెను చూసేందుకు జగన్‌ లండన్‌కు వెళ్లడం పైనా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారంటే ఆయన ఎంతగా దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. చంద్రబాబు మనిషి కాదు ఒక రోబో అన్న విషయం దీని బట్టి తెలుస్తోందన్నారు. సైనికులపై ఉగ్రవాదులు దాడులు చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి పాకిస్థాన్‌ను సమర్ధించే స్థాయికి చంద్రబాబు వచ్చారన్నారు. చంద్రబాబు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారిగా మారారని విమర్శించారు. హైదరాబాద్‌లో సగం ఆస్తులు చంద్రబాబు ఆయన మంత్రులు, టీడీపీ ఎంపీల […]

అదే నిజమైతే ముందు యనమల వైసీపీలో చేరే వారు....
X

చివరకు కుమార్తెను చూసేందుకు జగన్‌ లండన్‌కు వెళ్లడం పైనా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారంటే ఆయన ఎంతగా దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.

చంద్రబాబు మనిషి కాదు ఒక రోబో అన్న విషయం దీని బట్టి తెలుస్తోందన్నారు. సైనికులపై ఉగ్రవాదులు దాడులు చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి పాకిస్థాన్‌ను సమర్ధించే స్థాయికి చంద్రబాబు వచ్చారన్నారు. చంద్రబాబు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారిగా మారారని విమర్శించారు.

హైదరాబాద్‌లో సగం ఆస్తులు చంద్రబాబు ఆయన మంత్రులు, టీడీపీ ఎంపీల చేతుల్లోనే ఉన్నాయన్నారు శ్రీకాంత్ రెడ్డి. వైసీపీలో చేరిన వారి ఆస్తులు ఎక్కువగా హైదరాబాద్‌లో ఉన్నాయో… టీడీపీ ఎంపీల ఆస్తులు ఎక్కువగా ఉన్నాయో తేల్చేందుకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు.

కేసీఆర్ బెదిరించడం వల్లే టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు అన్నదే నిజమైతే ముందుగా మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన వియ్యంకుడే వైసీపీలో చేరాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో యనమలకు ఎక్కువ ఆస్తులున్నాయో… లేక వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబుకు ఎక్కువగా ఉన్నాయో తేలుద్దామా అని సవాల్ చేశారు శ్రీకాంత్ రెడ్డి.

First Published:  22 Feb 2019 3:05 AM GMT
Next Story