Telugu Global
NEWS

లక్ష మందితో భారీ సభలో చేరిక

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 28న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. కొడుమూరులోని ఆర్‌ అండ్ బి గెస్ట్‌హౌజ్‌కు సమీపంలోని గ్రౌండ్‌లో లక్ష మందితో సభ నిర్వహించనున్నారు. కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో జనసమీకరణ కోసం కోట్ల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు చంద్రబాబు హాజరవుతారు. ఆయన సమక్షంలోనే కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరుతుంది. వచ్చే ఎన్నికల్లో కోట్ల […]

లక్ష మందితో భారీ సభలో చేరిక
X

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 28న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.

కొడుమూరులోని ఆర్‌ అండ్ బి గెస్ట్‌హౌజ్‌కు సమీపంలోని గ్రౌండ్‌లో లక్ష మందితో సభ నిర్వహించనున్నారు. కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో జనసమీకరణ కోసం కోట్ల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు చంద్రబాబు హాజరవుతారు. ఆయన సమక్షంలోనే కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరుతుంది.

వచ్చే ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి టీడీపీ తరపున కర్నూలు ఎంపీగా పోటీ చేయనున్నారు. భార్య సుజాతమ్మను ఆలూరు నుంచి బరిలో దింపే అవకాశం ఉంది. కోట్ల కుటుంబం డోన్ నియోజక వర్గాన్ని కూడా కేటాయించాలని కోరుతోంది.

అయితే అందుకు కేఈ కుటుంబం అడ్డుపడుతోంది. డోన్‌ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కర్నూలు ఎంపీ, ఆలూరు అసెంబ్లీ టికెట్లతో సర్దుకునేందుకు కోట్ల కుటుంబం సిద్ధమైంది. ఈసారి ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కుమారుడు కోట్ల రాఘవేంద్రరెడ్డికి టికెట్‌ దక్కే అవకాశం లేదు. ఆయనకు ఏదైనా నామినేటెడ్‌ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు సమాచారం.

First Published:  20 Feb 2019 8:50 PM GMT
Next Story