Telugu Global
Cinema & Entertainment

రకుల్ వద్దట... రాశీ ఖన్నా కావాలట

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇప్పటివరకు ఒక్క పెద్ద హిట్ కూడా లేదు. ఈ హీరో ఒక మంచి సూపర్ హిట్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. ఇక ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనతో ఒక తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు ఈ హీరో. అవును తమిళ్ లో సూపర్ హిట్ థ్రిల్లర్ గా నిలిచినా “రట్ససన్” ని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రమేష్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ […]

రకుల్ వద్దట... రాశీ ఖన్నా కావాలట
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇప్పటివరకు ఒక్క పెద్ద హిట్ కూడా లేదు. ఈ హీరో ఒక మంచి సూపర్ హిట్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. ఇక ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనతో ఒక తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు ఈ హీరో. అవును తమిళ్ లో సూపర్ హిట్ థ్రిల్లర్ గా నిలిచినా “రట్ససన్” ని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

రమేష్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకున్నారట మూవీ యూనిట్. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే బెల్లంకొండ సరసన “జయ జానకి నాయక” లో నటించింది.

ఇక ఇప్పుడు ఈ స్థానం లో రాశీ ఖన్నా ని హీరోయిన్ గా తీసుకోనున్నారట మూవీ యూనిట్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రాశీ జోడి అయితే సినిమాకి ఒక ఫ్రెష్ లుక్ వస్తుందని డైరెక్టర్ భావిస్తున్నాడట. తమిళ్ లో అమలా పాల్ చేసిన పాత్రని తెలుగు లో రాశీ ఖన్నా చేయబోతుంది.

First Published:  19 Feb 2019 10:29 PM GMT
Next Story