Telugu Global
NEWS

మహేష్ ఏయంబీ సినిమాస్ లో చిలక్కొట్టుడు

మహేష్ బాబు ఇటీవల నిర్మించిన ఏయంబీ సినిమాస్‌ మల్టీఫ్లెక్స్ మరో వివాదంలో చిక్కుకుంది. జీఎస్టీ అధికారులు ఈ మల్టీప్లెక్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. సినిమా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల నుంచి టికెట్లకు ఎక్కువ సొమ్ము వసూలు చేస్తుండడంతో జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ. 100కు పైగా ధర ఉన్న టికెట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో సినిమా టికెట్ల ధరలు తగ్గాయి. అయితే మహేష్ బాబుకు చెందిన ఏయంబీ సినిమాస్‌ […]

మహేష్ ఏయంబీ సినిమాస్ లో చిలక్కొట్టుడు
X

మహేష్ బాబు ఇటీవల నిర్మించిన ఏయంబీ సినిమాస్‌ మల్టీఫ్లెక్స్ మరో వివాదంలో చిక్కుకుంది. జీఎస్టీ అధికారులు ఈ మల్టీప్లెక్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. సినిమా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల నుంచి టికెట్లకు ఎక్కువ సొమ్ము వసూలు చేస్తుండడంతో జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఇటీవల బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ. 100కు పైగా ధర ఉన్న టికెట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో సినిమా టికెట్ల ధరలు తగ్గాయి. అయితే మహేష్ బాబుకు చెందిన ఏయంబీ సినిమాస్‌ మాత్రం పాత ధరలకే టికెట్లు అమ్ముతూ సినీ ప్రేక్షకుల జేబులను కొల్లగొడుతోంది.

దీంతో రంగంలోకి దిగిన జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఏయంబీ సినిమాస్ నిర్వాహకులు మాత్రం జీఎస్టీ అధికారులు తనిఖీ చేసిన మాట వాస్తవమేనని… నోటీసులు మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారు.

First Published:  20 Feb 2019 1:53 AM GMT
Next Story