Telugu Global
Cinema & Entertainment

పృథ్వీ కి వార్నింగ్ ఇచ్చిన మెగా బ్రదర్

ఈ మధ్యనే జనసేన పార్టీ కి మెగా బ్రదర్ నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కలిసి తమ వంతుగా కోటి 25 లక్షలు విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. ఈ విరాళంపై కమెడియన్ ఫృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఎక్కడినుండో తీసుకు వచ్చిన డబ్బును తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేన పార్టీ ఫండ్ గా ఇచ్చారు”అంటూ పృథ్వీ కామెంట్ చేశారు. అయితే ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ మాటలను నాగ బాబు దృష్టికి తీసుకువచ్చారు […]

పృథ్వీ కి వార్నింగ్ ఇచ్చిన మెగా బ్రదర్
X

ఈ మధ్యనే జనసేన పార్టీ కి మెగా బ్రదర్ నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కలిసి తమ వంతుగా కోటి 25 లక్షలు విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. ఈ విరాళంపై కమెడియన్ ఫృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఎక్కడినుండో తీసుకు వచ్చిన డబ్బును తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేన పార్టీ ఫండ్ గా ఇచ్చారు”అంటూ పృథ్వీ కామెంట్ చేశారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ మాటలను నాగ బాబు దృష్టికి తీసుకువచ్చారు యాంకర్. “ఫండ్ గురించి పృథ్వీ కామెంట్ చేశాడా?…. రేయ్ ఫృథ్వీ, రేపు నువ్వు నాకు ఫోన్ చేయరా. ఈ ప్రశ్నకి నేను నీకే సమాధానం ఇస్తాను. ఫృథ్వీ నీకే చెబుతున్నా రేప్పొద్దున ఫోన్ చెయ్ నా నెంబర్ నీ దగ్గర ఉంది’’ అంటూ నాగబాబు గట్టిగా చెప్పారు.

అంతేకాక ఎవరికోసమే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని అది బ్లాక్ మనీ కాదని, తాము ఐటీకి ఆ డబ్బులు చూపించామని, అది అకౌంటెడ్ క్యాష్ అని చెప్పిన నాగ బాబు అది పన్ను చెల్లించిన అమౌంట్ అని స్పష్టం చేశారు.

First Published:  18 Feb 2019 6:16 AM GMT
Next Story