Telugu Global
Cinema & Entertainment

ముచ్చటగా మూడో సారి....

స్టార్ హీరోయిన్ అనుష్క, అలాగే దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి “రుద్రమదేవి” సినిమాలో నటించారు. ఆ తరువాత ఈ ఇద్దరు “బాహుబలి” సిరీస్ లో కూడా కలిసి నటించారు. ఇక ఇప్పుడు రానా మళ్ళీ అనుష్క తో కలిసి నటించేందుకు సిద్ధమయ్యాడు. అనుష్క “భాగమతి” తరువాత చేస్తున్న సినిమా “సైలెన్స్” (కానీ ఇప్పుడు ”నిశ్శబ్దం” అనే టైటిల్ ప్రచారంలో ఉంది). పూర్తి స్థాయి థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ […]

ముచ్చటగా  మూడో సారి....
X

స్టార్ హీరోయిన్ అనుష్క, అలాగే దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి “రుద్రమదేవి” సినిమాలో నటించారు. ఆ తరువాత ఈ ఇద్దరు “బాహుబలి” సిరీస్ లో కూడా కలిసి నటించారు. ఇక ఇప్పుడు రానా మళ్ళీ అనుష్క తో కలిసి నటించేందుకు సిద్ధమయ్యాడు. అనుష్క “భాగమతి” తరువాత చేస్తున్న సినిమా “సైలెన్స్” (కానీ ఇప్పుడు ”నిశ్శబ్దం” అనే టైటిల్ ప్రచారంలో ఉంది).

పూర్తి స్థాయి థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో రానా నటించబోతున్నాడట. రానా పాత్ర కథకి చాలా కీలకమట. మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, “అర్జున్ రెడ్డి” ఫేం శాలిని పాండే కూడా నటిస్తున్నారు.

కోన ఫిలిం కార్పొరేషన్ పై కోన వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వ ప్రసాద్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా సన్నగా మారింది. త్వరలో ఫారిన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

First Published:  18 Feb 2019 4:52 AM GMT
Next Story