Telugu Global
National

జమ్ములో భారీ పేలుడు.... 20మంది జవాన్లు మృతి!

జమ్ముకశ్మీర్ లో భారీ పేలుడు సంభవించింది. పులవామా జిల్లా అవంతిపురాలో జరిగిన భారీ పేలుడులో 20మంది జవానులు అమరులయ్యారు. మరో 13 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు కోసం ఐఈడీ వాడినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు దాటికి జవాన్లు ముక్కలుముక్కలుగా ఎగిరిపడ్డారు. ఎక్కడ చూసినా భయానక వాతావరణం నెలకొంది. రోడ్లపై శరీర అవయవాలు, రక్తంతో భీకర పరిస్థితి నెలకొంది. […]

జమ్ములో భారీ పేలుడు.... 20మంది జవాన్లు మృతి!
X

జమ్ముకశ్మీర్ లో భారీ పేలుడు సంభవించింది. పులవామా జిల్లా అవంతిపురాలో జరిగిన భారీ పేలుడులో 20మంది జవానులు అమరులయ్యారు. మరో 13 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ పేలుడు కోసం ఐఈడీ వాడినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు దాటికి జవాన్లు ముక్కలుముక్కలుగా ఎగిరిపడ్డారు. ఎక్కడ చూసినా భయానక వాతావరణం నెలకొంది. రోడ్లపై శరీర అవయవాలు, రక్తంతో భీకర పరిస్థితి నెలకొంది.

ఈ పేలుడు తమ పనేనంటూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. రెండు బస్సులు, కాన్వాయ్ లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది. కాన్వాయ్ లోకి ఆత్మాహుతి బాంబర్…. కారును తీసుకెళ్లి పేల్చేసుకున్నట్లు సమాచారం. కాన్వాయ్ లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. అందులోని రెండు వాహనాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి జరిపారు.

2004 తర్వాత జరిగిన భారీ దాడిగా అధికారులు చెబుతున్నారు. వీరంతా 54వ బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ సిబ్బందిగా చెబుతున్నారు.

First Published:  14 Feb 2019 8:33 AM GMT
Next Story