Telugu Global
NEWS

టాలీవుడ్ హీరోల‌పై మ‌మ్ముట్టి ఫ్యాన్స్ ఆగ్ర‌హం

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ప్లాప్ అయినా స‌రే టాలీవుడ్‌కు చెందిన హీరోలు వ‌ర‌స పెట్టి అద్భుతం, బీభ‌త్సం, సూప‌ర్ సినిమా అంటూ వ‌ర‌స‌గా ట్వీట్లు పెట్టి హోరెత్తించారు. వారిలో మ‌హేష్ బాబు కూడా ఉన్నారు. ప‌ద్మాల‌య స్టూడియో వివాదంలో చిక్కుకున్న‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అండ‌గా నిల‌బ‌డి స్డూడియో స్థ‌లం కృష్ణ కుటుంబానికే ద‌క్కేలా చేశారు. దాన్ని అమ్ముకుని మ‌హేష్‌బాబు కుటుంబం వంద‌ల కోట్లు లాభ‌ప‌డింది. కానీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా తీసిన యాత్ర సినిమా మంచి టాక్‌తో న‌డుస్తున్నా మ‌హేష్‌బాబుతో స‌హా […]

టాలీవుడ్ హీరోల‌పై మ‌మ్ముట్టి ఫ్యాన్స్ ఆగ్ర‌హం
X

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ప్లాప్ అయినా స‌రే టాలీవుడ్‌కు చెందిన హీరోలు వ‌ర‌స పెట్టి అద్భుతం, బీభ‌త్సం, సూప‌ర్ సినిమా అంటూ వ‌ర‌స‌గా ట్వీట్లు పెట్టి హోరెత్తించారు. వారిలో మ‌హేష్ బాబు కూడా ఉన్నారు. ప‌ద్మాల‌య స్టూడియో వివాదంలో చిక్కుకున్న‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అండ‌గా నిల‌బ‌డి స్డూడియో స్థ‌లం కృష్ణ కుటుంబానికే ద‌క్కేలా చేశారు. దాన్ని
అమ్ముకుని మ‌హేష్‌బాబు కుటుంబం వంద‌ల కోట్లు లాభ‌ప‌డింది.

కానీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా తీసిన యాత్ర సినిమా మంచి టాక్‌తో న‌డుస్తున్నా మ‌హేష్‌బాబుతో స‌హా ఏ ఒక్క హీరో కూడా స్పందించ‌లేదు.

సినిమాను ప్ర‌శంసిస్తే చంద్ర‌బాబు ఫీల్ అవుతార‌ని కొంద‌రు, టాలీవుడ్‌లో ద‌శాబ్దాలుగా పేరుకుపోయిన కుల గ‌జ్జికి నిద‌ర్శ‌నంగా మ‌రికొంద‌రు యాత్ర సినిమాపై స్పందించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు బ‌హిరంగంగానే వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు, డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి లాంటి కొంద‌రు మాత్ర‌మే యాత్ర సినిమాపై స్పందించారు. సినిమాను అభినందించారు.

అయితే ఈ చిత్రంలో వైఎస్ పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టించారు. క‌నీసం మ‌మ్ముట్టి కోసం కూడా టాలీవుడ్ హీరోలు సినిమాపై స్పందించ‌క‌పోవ‌డం మ‌మ్ముట్టి ఫ్యాన్స్‌కు కోపాన్ని తెప్పిస్తోంది. మ‌ళ‌యాళంలో తిరుగులేని స్టార్‌గా ఉన్న మ‌మ్ముట్టి న‌టించిన సినిమా విష‌యంలోనూ టాలీవుడ్ స్పందించ‌క‌పోవ‌డం అక్క‌డ చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పైగా ఈ చిత్రానికి థియేట‌ర్లు దొర‌క్కుండా కొంద‌రు టాలీవుడ్ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేశార‌న్న అంశంపై మ‌మ్ముట్టి ఫ్యాన్స్‌కు మ‌రింత కోపాన్ని తెప్పిస్తోంది. కేర‌ళ‌లో అల్లు అర్జున్‌కు భారీగా ఫాలోయింగ్ ఉంది. అక్క‌డ అల్లు అర్జున్‌ను ఇష్ట‌ప‌డే వారిలో మమ్ముట్టి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటిది అల్లు అర్జున్ కూడా మ‌మ్ముట్టి న‌టించిన యాత్ర సినిమాపై స్పందించ‌క‌పోవ‌డం కేర‌ళ‌లో మమ్ముట్టి ఫ్యాన్స్‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

మ‌మ్ముట్టి సినిమాకు టాలీవుడ్‌లో ఎదుర‌వుతున్న ట్రీట్‌మెంట్‌పై మ‌ళ‌యాల చిత్ర అభిమానులు ఆగ్ర‌హంగా ఉన్నారు. అయితే ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగానూ, చంద్ర‌బాబు మీద ఉన్న అభిమానంతోనే యాత్ర సినిమా ప‌ట్ల టాలీవుడ్ స్పందించ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని మ‌మ్ముట్టి బ్యాచ్‌కు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు కొంద‌రు టాలీవుడ్ మీడియేట‌ర్లు.

First Published:  12 Feb 2019 9:32 PM GMT
Next Story