కేఏ పాల్ ఇంట విషాదం
మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నుమూశారు. 78 ఏళ్ల కిలారి సరోజమ్మ అనారోగ్యంతో రాత్రి తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా విశాఖలోని అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. తన తల్లి మరణ వార్తను కేఏ పాల్ వెల్లడించారు. తన తల్లి ప్రభువు వద్దకు వెళ్లారని వ్యాఖ్యానించారు. స్వర్గంలో ఆమె మరింత ఆనందంగా ఉంటారని అన్నారు. ఇటీవల కూడా ఒక మీడియా సమావేశంలో తల్లి అనారోగ్యాన్ని తలుచుకుని కేఏ పాల్ విలపించారు.
![కేఏ పాల్ ఇంట విషాదం కేఏ పాల్ ఇంట విషాదం](https://www.teluguglobal.com/h-upload/old_images/126209-ka-paul-mother-passed-away.webp)
మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నుమూశారు. 78 ఏళ్ల కిలారి సరోజమ్మ అనారోగ్యంతో రాత్రి తుది శ్వాస విడిచారు.
కొంతకాలంగా విశాఖలోని అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. తన తల్లి మరణ వార్తను కేఏ పాల్ వెల్లడించారు. తన తల్లి ప్రభువు వద్దకు వెళ్లారని వ్యాఖ్యానించారు.
స్వర్గంలో ఆమె మరింత ఆనందంగా ఉంటారని అన్నారు. ఇటీవల కూడా ఒక మీడియా సమావేశంలో తల్లి అనారోగ్యాన్ని తలుచుకుని కేఏ పాల్ విలపించారు.