Telugu Global
NEWS

జనసేన కార్యాలయంపై దాడి

గుంటూరులోని జనసేన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఇటీవలే గుంటూరు ఇన్నర్‌ రింగ్ రోడ్డులోని ఈ కార్యాలయాన్ని  పవన్‌ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు బీర్‌ బాటిళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. జనసేన ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు ఈ తరహా దాడులు చేస్తున్నారని జనసేన […]

జనసేన కార్యాలయంపై దాడి
X

గుంటూరులోని జనసేన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఇటీవలే గుంటూరు ఇన్నర్‌ రింగ్ రోడ్డులోని ఈ కార్యాలయాన్ని పవన్‌ కల్యాణ్ ప్రారంభించారు.

ఈ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు బీర్‌ బాటిళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులున్నారు.

జనసేన ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు ఈ తరహా దాడులు చేస్తున్నారని జనసేన వ్యాఖ్యానించింది. దీన్ని ఓ పిరికిపంద చర్యగా తాము భావిస్తున్నామని ప్రకటించింది.

First Published:  5 Feb 2019 12:06 AM GMT
Next Story