Telugu Global
NEWS

ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల మళ్లింపు.... బాబును పొగిడే వారికి ప్రత్యేక సన్మానం

ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఓటర్లకు గాలం వేస్తోంది. ప్రచారానికి భారీగా ఖర్చు పెట్టబోతోంది. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద మూడు విడతల్లో మూడు వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సొమ్మును రుణం కింద ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పసుపు- కుంకుమ పథకానికి సమకూర్చిన నిధుల వ్యవహారం దుమారం రేపుతోంది. పసుపు-కుంకుమ కోసం ఎస్సీఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను భారీగా దారి మళ్లించారు. నిజానికి ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించడం చట్ట విరుద్దం. అయినా […]

ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల మళ్లింపు.... బాబును పొగిడే వారికి ప్రత్యేక సన్మానం
X

ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఓటర్లకు గాలం వేస్తోంది. ప్రచారానికి భారీగా ఖర్చు పెట్టబోతోంది. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద మూడు విడతల్లో మూడు వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సొమ్మును రుణం కింద ఇస్తున్నారు.

ఇప్పుడు ఈ పసుపు- కుంకుమ పథకానికి సమకూర్చిన నిధుల వ్యవహారం దుమారం రేపుతోంది. పసుపు-కుంకుమ కోసం ఎస్సీఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను భారీగా దారి మళ్లించారు. నిజానికి ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించడం చట్ట విరుద్దం. అయినా సరే చంద్రబాబు రూల్స్ ను తుంగలో తొక్కి ఎస్సీ సబ్‌ప్లాన్‌ నుంచి రూ. 1,668 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నుంచి రూ. 469 కోట్లు దారి మళ్లించారు.

ఈ సొమ్మునే పసుపు-కుంకుమ కింద చెల్లించనున్నారు. ఈ కార్యక్రమాన్ని బాగా ప్రచారం చేసేందుకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. చంద్రబాబును పొగిడే సభల నిర్వాహణకు ప్రత్యేకంగా రూ. 31.6 కోట్లు కేటాయించారు. సభల్లో చంద్రబాబును బాగా పొగిడే వారిని గుర్తించి సన్మానాలు చేయాల్సిందిగా సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ నుంచి అన్ని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు రోజుల పాటు చంద్రబాబును పొగిడే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

First Published:  1 Feb 2019 11:10 PM GMT
Next Story