Telugu Global
National

గాంధీ మహాత్ముడి బొమ్మను కాల్చి తగలబెట్టిన హిందూ మహాసభ

గాంధీ వర్ధంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో హిందూ మహాసభ నీచమైన కార్యక్రమానికి పూనుకుంది. గాంధీని చంపిన గాడ్సేకు పూజలు నిర్వహించింది. అంతటితో ఆగకుండా గాంధీ బొమ్మను తయారు చేసి, ఆ బొమ్మను తుపాకీతో కాలుస్తూ హిందూ మహాసభ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత గాంధీ బొమ్మను తగలబెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఈ విజువల్స్‌ బయటకు రావడంతో స్వాతంత్ర సమరయోధులు హిందూ మహాసభ పై మండిపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు కూడా హిందూ మహాసభ […]

గాంధీ మహాత్ముడి బొమ్మను కాల్చి తగలబెట్టిన హిందూ మహాసభ
X

గాంధీ వర్ధంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో హిందూ మహాసభ నీచమైన కార్యక్రమానికి పూనుకుంది. గాంధీని చంపిన గాడ్సేకు పూజలు నిర్వహించింది. అంతటితో ఆగకుండా గాంధీ బొమ్మను తయారు చేసి, ఆ బొమ్మను తుపాకీతో కాలుస్తూ హిందూ మహాసభ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత గాంధీ బొమ్మను తగలబెట్టి పైశాచిక ఆనందం పొందారు.

ఈ విజువల్స్‌ బయటకు రావడంతో స్వాతంత్ర సమరయోధులు హిందూ మహాసభ పై మండిపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు కూడా హిందూ మహాసభ దుర్మార్గపు కార్యక్రమం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ ఏ విగ్రహానికి చిన్న అవమానం జరిగినా, ద్వంసం చేసినా నిందితులను అరెస్ట్‌ చేసే ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా జాతిపితనే అవమానించిన హిందూ మహాసభ సభ్యులను తక్షణమే అరెస్టు చేయాలని కోరుతున్నారు.

First Published:  30 Jan 2019 5:31 AM GMT
Next Story