Telugu Global
National

ఏకకాలంలో 74 చోట్ల దాడులు చేసిన ఐటీ శాఖ

ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇవాళ ఉదయం ఏకకాలంలో 74 చోట్ల దాడులు ప్రారంభించారు. చెన్నైలో ప్రముఖ వ్యాపార సంస్థలైన శరవణ స్టోర్స్, రేవతి గ్రూప్, లోటస్ సంస్థలకు చెందిన పలు వస్త్ర, నగల దుకాణాల్లో సోదాలు జరుపుతున్నారు. తమిళనాడులో ప్రసిద్ది చెందిన ఈ వ్యాపార సంస్థలు…. ఆదాయపు శాఖకు సమర్పించిన పన్ను ఫైలింగ్స్‌కు…. వీరి వ్యాపార లావాదేవీలకు పొంతన కుదరలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో దాదాపు 150 మంది అధికారుల బృందం ఉదయం నుంచి సోదాలు […]

ఏకకాలంలో  74 చోట్ల దాడులు చేసిన ఐటీ శాఖ
X

ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇవాళ ఉదయం ఏకకాలంలో 74 చోట్ల దాడులు ప్రారంభించారు. చెన్నైలో ప్రముఖ వ్యాపార సంస్థలైన శరవణ స్టోర్స్, రేవతి గ్రూప్, లోటస్ సంస్థలకు చెందిన పలు వస్త్ర, నగల దుకాణాల్లో సోదాలు జరుపుతున్నారు.

తమిళనాడులో ప్రసిద్ది చెందిన ఈ వ్యాపార సంస్థలు…. ఆదాయపు శాఖకు సమర్పించిన పన్ను ఫైలింగ్స్‌కు…. వీరి వ్యాపార లావాదేవీలకు పొంతన కుదరలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో దాదాపు 150 మంది అధికారుల బృందం ఉదయం నుంచి సోదాలు ప్రారంభిచాయి.

ప్రముఖ వ్యాపార సంస్థలపై పెద్ద ఎత్తున అధికారులు దాడులు చేస్తుండటంతో వ్యాపార వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అయితే ఈ దాడుల్లో ఇంత వరకు ఎలాంటి అక్రమాలు బయటపడిన విషయం తెలియరాలేదు. మరింత సమాచారం అందాల్సి ఉంది.

First Published:  29 Jan 2019 2:48 AM GMT
Next Story