Telugu Global
National

మాయావతిపై మరో బీజేపీ నేత కించపరిచే వ్యాఖ్యలు

యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మాయావతికి ఆత్మగౌరవం లేదని సాధన సింగ్ అనే బీజేపీ నాయకుడు వ్యాఖ్యానిస్తే తాజాగా యూపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర నాథ్ పాండే కించపరిచే వ్యాఖ్యలు చేశారు. జనవరి 15న మాయావతి పుట్టిన రోజు నాడు ఎస్పీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆమెను ఒక శాలువాతో సత్కరించారు. దీన్ని ఆధారంగా మహేంద్ర నాథ్ పాండే వ్యాఖ్యలు చేశారు. ‘నేను సోషల్ […]

మాయావతిపై మరో బీజేపీ నేత కించపరిచే వ్యాఖ్యలు
X

యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మాయావతికి ఆత్మగౌరవం లేదని సాధన సింగ్ అనే బీజేపీ నాయకుడు వ్యాఖ్యానిస్తే తాజాగా యూపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర నాథ్ పాండే కించపరిచే వ్యాఖ్యలు చేశారు.

జనవరి 15న మాయావతి పుట్టిన రోజు నాడు ఎస్పీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆమెను ఒక శాలువాతో సత్కరించారు. దీన్ని ఆధారంగా మహేంద్ర నాథ్ పాండే వ్యాఖ్యలు చేశారు.

‘నేను సోషల్ మీడియాలో ఒక పోస్టు చదివాను.. దాంట్లో ఉన్నదేంటంటే.. 1995లో మాయావతిపై దాడి చేసినప్పుడు గుంజిన శాలువానేనా ఇవాళ అఖిలేష్ ఆమెపై తిరిగి కప్పుతున్నాడు’ అని వ్యాఖ్యానించారు.

1995లో ఎస్పీ కార్యకర్తలు కొంతమంది మాయావతిపై ఆమె గెస్ట్ హౌస్‌లో దాడి చేసి శాలువాను గుంజారు. ఆ ఘటన ఆధారంగా మహేంద్ర నాథ్ పాండే ఈ వ్యాఖ్యలు చేశారు.

First Published:  29 Jan 2019 4:55 AM GMT
Next Story