Telugu Global
NEWS

పెళ్లి కాని యువతులతో రాజుగారి సేద్యం....

విశాఖ జిల్లా ఎస్‌ రాయవరం మండలం గుడివాడ టీడీపీ నేత పేరిచర్ల శ్రీపతిరాజు చేస్తున్న వ్యవసాయం గుట్టు రట్టైంది. ఇటీవల శ్రీపతిరాజు కోటవురట్ల మండలంలో వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. జీడీ, బొప్పాయి, దానిమ్మ వంటి పంటలను సాగు చేస్తున్నారు. వందల ఎకరాల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేశారు. లోపలికి ఎవ్వరినీ అనుమతించరు. ఇక్కడ విలాసవంతమైన గెస్ట్‌ హౌజ్‌ కూడా నిర్మించుకున్నారు. కేవలం వీఐపీలకు మాత్రమే లోనికి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మరో కీలక విషయం […]

పెళ్లి కాని యువతులతో రాజుగారి సేద్యం....
X

విశాఖ జిల్లా ఎస్‌ రాయవరం మండలం గుడివాడ టీడీపీ నేత పేరిచర్ల శ్రీపతిరాజు చేస్తున్న వ్యవసాయం గుట్టు రట్టైంది. ఇటీవల శ్రీపతిరాజు కోటవురట్ల మండలంలో వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

జీడీ, బొప్పాయి, దానిమ్మ వంటి పంటలను సాగు చేస్తున్నారు. వందల ఎకరాల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేశారు. లోపలికి ఎవ్వరినీ అనుమతించరు. ఇక్కడ విలాసవంతమైన గెస్ట్‌ హౌజ్‌ కూడా నిర్మించుకున్నారు.

కేవలం వీఐపీలకు మాత్రమే లోనికి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఈ పొలంలో పనిచేసేందుకు కేవలం పెళ్లి కాని యువతులను మాత్రమే నియమించుకున్నారు. వారికి ఎలక్ట్రికల్ స్కూటర్లను ఇచ్చారు. వాటిపై పగలు తిరుగుతూ వ్యవసాయ పనులను పర్యవేక్షిస్తుంటారు. రాత్రి అయితే కుక్కలను వదులుతారు. ఎవరినీ లోనికి రానివ్వరు. ఇలా గుట్టుగా సాగుతున్న ఈ సేద్యంపై స్థానికంగా చాలా ఆరోపణలు ఉన్నాయి.

కానీ పోలీసులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. చివరకు అటవీ అధికారులు ధైర్యం చేసి దాడి చేశారు. దాంతో లోపల సాగుతున్న తంతు బయటపడింది.

లోపల రహస్యంగా వన్యప్రాణులను పెంచుతున్నట్టు గుర్తించారు. దుప్పి, నెమళ్లు, కొండగొర్రెలను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే లొంగిపోవాలని శ్రీపతిరాజుకు అటవీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం శ్రీపతిరాజు అజ్ఞాతంలో ఉన్నారు.

First Published:  6 Jan 2019 10:58 PM GMT
Next Story