Telugu Global
NEWS

టీడీపీ కార్యకర్తలను కొట్టి పంపించిన కన్నా అనుచరులు

గుంటూరులో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసం వద్ద ఉద్రికత్త ఏర్పడింది. నిన్న కాకినాడలో సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యంలో అందుకు పోటీగా… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా నివాసం ముందు టీడీపీ కార్యకర్తలు గుంటూరులో ధర్నాకు దిగారు. కన్నా, బీజేపీకి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు. కన్నా నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. ధర్నాకు వచ్చిన టీడీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. […]

టీడీపీ కార్యకర్తలను కొట్టి పంపించిన కన్నా అనుచరులు
X

గుంటూరులో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసం వద్ద ఉద్రికత్త ఏర్పడింది. నిన్న కాకినాడలో సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యంలో అందుకు పోటీగా… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా నివాసం ముందు టీడీపీ కార్యకర్తలు గుంటూరులో ధర్నాకు దిగారు. కన్నా, బీజేపీకి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు.

కన్నా నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. ధర్నాకు వచ్చిన టీడీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

తన నివాసం ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేయడంపై బీజేపీ అధ్యక్షుడు కన్నా తీవ్రంగా స్పందించారు. ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయన్నారు. సీఎం ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారని విమర్శించారు.

కాకినాడలో ఒక మహిళా కార్పొరేటర్‌ను ఫినిష్ అయిపోతావని సీఎం హెచ్చరించడాన్ని చూసుకునే ఈరోజు టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి ప్రయత్నించారన్నారు.

ఏపీలో ప్రతిపక్ష నాయకులకు భద్రత లేకుండాపోయిందని… తన నివాసంపై దాడికి జరిగిన ప్రయత్నాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు కన్నా చెప్పారు.

First Published:  5 Jan 2019 12:57 AM GMT
Next Story