Telugu Global
Cinema & Entertainment

హరీష్ శంకర్ పై సీరియస్ గా ఉన్న ఇద్దరు హీరోలు

గత ఏడాది “డీజే” సినిమాతో ఆకట్టుకున్న హరీష్ శంకర్ ఆ సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా స్టార్ట్ చెయ్యలేదు. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ తమిళ సూపర్ హిట్ సినిమా “జిగర్తాండ”ని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరో యువ హీరో ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ నటుల సెలక్షన్ వల్ల ఇద్దరు హీరోలు హరీష్ శంకర్ […]

హరీష్ శంకర్ పై సీరియస్ గా ఉన్న ఇద్దరు హీరోలు
X

గత ఏడాది “డీజే” సినిమాతో ఆకట్టుకున్న హరీష్ శంకర్ ఆ సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా స్టార్ట్ చెయ్యలేదు. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ తమిళ సూపర్ హిట్ సినిమా “జిగర్తాండ”ని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరో యువ హీరో ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ నటుల సెలక్షన్ వల్ల ఇద్దరు హీరోలు హరీష్ శంకర్ పై ఫుల్ సీరియస్ గా ఉన్నారు అని అర్ధం అవుతుంది.

అసలు ఈ సినిమా రీమేక్ చేయాలి అని అనుకున్నప్పుడు రవితేజ ని లీడ్ రోల్ లో పెడదాం అని హరీష్ శంకర్ భావించాడట. అందుకే “అమర్ అక్బర్ ఆంటో” షూటింగ్లో రవితేజని కలిసాడు హరీష్. కానీ “అమర్ అక్బర్ ఆంటోని” చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన తరువాత హరీష్ మళ్ళీ రవితేజని కలవలేదని సమాచారం. ఇక ఈ రీమేక్ లో మరో పాత్ర కోసం హరీష్ శంకర్ సాయిధరమ్ తేజ్ ని కలిశాడట. తేజు కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ కూడా ప్రస్తుతం “చిత్రలహరి” షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు తమని కాదని వేరే హీరోలని తీసుకున్నందుకు హరీష్ శంకర్ పై సీరియస్ గా ఉన్నారు అంట రవితేజ ఇంకా సాయి ధరం తేజ్.

First Published:  31 Dec 2018 11:03 PM GMT
Next Story