Telugu Global
International

ప్రతీకారం తీర్చుకున్న ఈజిప్టు సైన్యం.... 40 మంది ఉగ్రమూకలు హతం!

ఉగ్రమూకలపై ఈజిప్టు సైన్యం విరుచుకుపడింది. ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ వద్ద బాంబు పేల్చి ముగ్గురు విదేశీయులను బలి తీసుకున్న ఉగ్రమూకలపై…ప్రతికారం తీర్చుకుంది. గిజాతోపాటు సినాయ్ ద్వీకల్పంలోని ఉగ్రవాదుల స్ధావరాలపై ఈజిప్టు సైన్యం దాడులు జరిపింది. 40మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. శుక్రవారం గిజాలో టూరిస్టుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు వియత్నాం పౌరులతో పాటు ఒక ఈజిప్టు గైడ్ చనిపోయారు. మరో పదిమంది పర్యాటకులు గాయపడ్డారు. విదేశీ పర్యాటకులు, ప్రభుత్వ కీలక ఆర్థిక వనరులపై […]

ప్రతీకారం తీర్చుకున్న ఈజిప్టు సైన్యం.... 40 మంది ఉగ్రమూకలు హతం!
X

ఉగ్రమూకలపై ఈజిప్టు సైన్యం విరుచుకుపడింది. ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ వద్ద బాంబు పేల్చి ముగ్గురు విదేశీయులను బలి తీసుకున్న ఉగ్రమూకలపై…ప్రతికారం తీర్చుకుంది.

గిజాతోపాటు సినాయ్ ద్వీకల్పంలోని ఉగ్రవాదుల స్ధావరాలపై ఈజిప్టు సైన్యం దాడులు జరిపింది. 40మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. శుక్రవారం గిజాలో టూరిస్టుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు వియత్నాం పౌరులతో పాటు ఒక ఈజిప్టు గైడ్ చనిపోయారు. మరో పదిమంది పర్యాటకులు గాయపడ్డారు.

విదేశీ పర్యాటకులు, ప్రభుత్వ కీలక ఆర్థిక వనరులపై మరిన్ని దాడులు జరిపేందుకు సిద్దమవుతున్నారన్న సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది.

శనివారం వేకువజామున గిజాలోని రెండు ప్రాంతాలతోపాటు సినాయ్‌ ప్రావిన్స్‌లో ఉగ్ర స్థావరాలపై బలగాలు ఒక్కసారిగా దాడులు జరిపాయి. ఈ దాడుల్లో మొత్తం 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

దీర్ఘకాలంపాటు ఈజిప్టును పాలించిన హోస్నీ ముబారక్‌ 2011లో వైదొలిగాక దేశంలో తీవ్ర అస్థిరత నెలకొంది. దేశంలో సుస్థిర పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్న తరుణంలో జరిగిన తాజా ఉగ్ర దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

First Published:  30 Dec 2018 10:03 PM GMT
Next Story