Telugu Global
NEWS

సుభాష్ పత్రి ఆశ్రమంలో యువతి అనుమానాస్పద మృతి

వివాదాస్పద ధ్యాన గురువు సుభాష్ పత్రి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మహిళలను హత్తుకోవడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలతో గతంలో తీవ్ర వివాదాస్పదమయ్యారు. పత్రి ధ్యాన పిరమిడ్ పేరుతో చుట్టూ రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మహిళల పట్ల పత్రి ప్రవర్తించే తీరు వివాదాస్పదమైంది. రంగారెడ్డిజిల్లా కడ్తాల్‌లోని పత్రి ఆశ్రమంలో అనుమానాస్పద ఘటనలు చాలా జరుగుతుంటాయన్న ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే కడ్తాల్‌లోని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒక మహిళ అనుమానాస్పదంగా […]

సుభాష్ పత్రి ఆశ్రమంలో యువతి అనుమానాస్పద మృతి
X

వివాదాస్పద ధ్యాన గురువు సుభాష్ పత్రి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మహిళలను హత్తుకోవడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలతో గతంలో తీవ్ర వివాదాస్పదమయ్యారు.

పత్రి ధ్యాన పిరమిడ్ పేరుతో చుట్టూ రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మహిళల పట్ల పత్రి ప్రవర్తించే తీరు వివాదాస్పదమైంది.

రంగారెడ్డిజిల్లా కడ్తాల్‌లోని పత్రి ఆశ్రమంలో అనుమానాస్పద ఘటనలు చాలా జరుగుతుంటాయన్న ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే కడ్తాల్‌లోని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒక మహిళ అనుమానాస్పదంగా చనిపోయింది.

35 ఏళ్ల కల్యాణి నోట్లో నుంచి నురగలు కక్కుతూ ఆశ్రమంలో ప్రాణాలు విడిచారు. కల్యాణి స్వస్థలం గుంటూరు జిల్లా పెరిగలపూడి. 35 ఏళ్ల మహిళ ఇలా అనుమాస్పదంగా చనిపోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆయన శిష్యుడు వెంకట రమణ దారుణ హత్యకు గురయ్యాడు.

First Published:  27 Dec 2018 2:13 AM GMT
Next Story