Telugu Global
NEWS

వైసీపీలో చేరిన రాంబాబు.... గిద్దలూరుపై క్లారిటీ

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరారు. పాదయాత్రలో జగన్‌ను కలిసిన అన్నా రాంబాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. అన్నా రాంబాబుతో పాటు ఆయన అనుచరులు, పలువురు టీడీపీ స్థానిక నేతలు పార్టీలో చేరారు. వారికి జగన్ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టికెట్ విషయంలో వైసీపీలో చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఐవీరెడ్డి గిద్దలూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ […]

వైసీపీలో చేరిన రాంబాబు.... గిద్దలూరుపై క్లారిటీ
X

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరారు. పాదయాత్రలో జగన్‌ను కలిసిన అన్నా రాంబాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. అన్నా రాంబాబుతో పాటు ఆయన అనుచరులు, పలువురు టీడీపీ స్థానిక నేతలు పార్టీలో చేరారు. వారికి జగన్ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు టికెట్ విషయంలో వైసీపీలో చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఐవీరెడ్డి గిద్దలూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ వచ్చారు. అన్నా రాంబాబు రాకతో ఐవీ రెడ్డి అవకాశాలకు గండిపడ్డట్టేనని భావిస్తున్నారు.

ఐవీ రెడ్డి స్థానంలో అన్నా రాంబాబును ఇన్‌చార్జ్‌గా నియమించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కూడా ఖాయం చేసుకునే అన్నా రాంబాబు వైసీపీలో చేరినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఆయన్ను ఇన్‌చార్జ్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

First Published:  22 Dec 2018 1:36 AM GMT
Next Story