Telugu Global
NEWS

టీడీపీకి 130 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాలు

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. 2019 ఎన్నికల్లో టీడీపీ 130 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించేందుకు కేశినేని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమితో మోడీ పతనం ప్రారంభమైందన్నారు. రఫెల్ కుంభకోణంపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కేశినేని […]

టీడీపీకి 130 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాలు
X

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. 2019 ఎన్నికల్లో టీడీపీ 130 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించేందుకు కేశినేని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమితో మోడీ పతనం ప్రారంభమైందన్నారు.

రఫెల్ కుంభకోణంపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కేశినేని వ్యాఖ్యానించారు.

First Published:  18 Dec 2018 1:37 AM GMT
Next Story