Telugu Global
National

బహుళార్థసాధక ప్రాజెక్ట్ " కేసీ వ్యాలీ "

దేశం మొత్తం మీద ప్రత్యేకత సంతరించుకున్న పథకం కేసీ వ్యాలీ (కోరమంగళ- చెళ్లగట్టా వ్యాలీ). ఇది ఓ అరుదైన, బహుళ ప్రయోజనాలతో కూడిన సాగునీటి పథకం. ఇంతకు ముందెప్పుడూ దేశంలో ఇటువంటి పథకం ఎక్కడా చేపట్టలేదు. ఓ వైపు నగరంలోని మురుగు, వ్యర్థ (డ్రైనేజి) సమస్యకు పరిష్కారం. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో అంతరించిపోతున్న చిన్న నీటి పారుదల వ్యవస్థకు పునరుజ్జీవం. ఇంకోవైపు ఆ ప్రాంతంలో భూగర్భజలాలను పెంపొందించడం. మురుగు నీటిని శుద్ధి చేసి గ్రామాల్లోని చెరువులకు దానిని […]

బహుళార్థసాధక ప్రాజెక్ట్  కేసీ వ్యాలీ
X

దేశం మొత్తం మీద ప్రత్యేకత సంతరించుకున్న పథకం కేసీ వ్యాలీ (కోరమంగళ- చెళ్లగట్టా వ్యాలీ). ఇది ఓ అరుదైన, బహుళ ప్రయోజనాలతో కూడిన సాగునీటి పథకం. ఇంతకు ముందెప్పుడూ దేశంలో ఇటువంటి పథకం ఎక్కడా చేపట్టలేదు.

ఓ వైపు నగరంలోని మురుగు, వ్యర్థ (డ్రైనేజి) సమస్యకు పరిష్కారం. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో అంతరించిపోతున్న చిన్న నీటి పారుదల వ్యవస్థకు పునరుజ్జీవం. ఇంకోవైపు ఆ ప్రాంతంలో భూగర్భజలాలను పెంపొందించడం.

మురుగు నీటిని శుద్ధి చేసి గ్రామాల్లోని చెరువులకు దానిని సాగు నీరుగా అందించి ఆయకట్టును అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ అరుదైన పథకాన్ని బెంగళూరు నగరంలోనూ, సరిహద్దులో ఉన్న కోలార్, చిక్బళ్ళాపూర్ జిల్లాలోనూ తాజాగా అమలులోకి తీసుకొచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్)కు దక్కిందని మేఘా వైస్‌ ప్రెసిడెంట్ సుధీర్ మోహన్ తెలిపారు.

ప్రపంచం మొత్తం మీద నీటిని వృధా కాకుండా శుద్ధి చేసి సూక్ష్మసేద్యం ద్వారా పంటలు పండించే పద్ధతులు ఇజ్రాయిల్ దేశంలో బాగా అమలవుతున్నాయి. అదే స్ఫూర్తితో భారతదేశంలో తొలిసారిగా బెంగళూరు నగరంలోని మురికినీటిని శుద్ధిచేసి కోలార్ జిల్లాలోని చెరువులకు అందించేవిధంగా కేసీ వ్యాలీ పథకాన్ని మేఘా నిర్మించింది.

దీనివల్ల బెంగళూరు నగరంలో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పెరిగిపోతున్న నగర జనాభా వల్ల అదే స్థాయిలో మురుగునీటి విడుదల అధికమై ఆ నీటిని ఏం చేయాలనే సమస్య నగరపాలక సంస్థను, ప్రభుత్వాన్ని వేధిస్తుండేది. అదే సమయంలో నగరానికి సమీపంలో ఉన్న కోలార్ జిల్లా తరచుగా వర్షాభావం వల్ల కరువు వాత పడుతూ వ్యవసాయానికి నీళ్ళు లేక రైతులు, గ్రామీణులు తీవ్రంగా నష్టపోతుండేవారు. ఈ రెండు సమస్యలను పరిష్కారించాలంటే మురుగునీటిని శుద్ధి చేసి ఆ జిల్లాలోని చెరువులకు సరఫరా చేయడం ద్వారా ఆయకట్టుకు కరువు పరిస్థితుల్లో సైతం నీరందించడం సాధ్యమవుతుందని భావించి అందుకు తగిన విధంగా కేసీ వ్యాలీ పథకాన్ని రూపొందించారు.

ఈ పథకాన్ని టెండర్లలో దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ అనేక అవరోధాలు, అవాంతరాలను అధిగమించి గడువుకన్నా ముందే పూర్తిచేయగలిగింది. అయితే ప్రభుత్వం ఈ పథకం క్రింద మరిన్ని అదనపు పనులను అప్పగిస్తుండడంతో ఇంకా పనులు జరుగుతున్నప్పటికి తాజాగా ఈ పథకం అమలులోకి వచ్చింది. బెంగళూరులో శుద్ధి చేసిన నీటిని ప్రస్తుతం పంపింగ్ చేయడం ద్వారా చెరువులకు నీటి సరఫరా ప్రారంభమయింది.

రోజుకు 440 మిలియన్‌ లీటర్ల మురుగునీటిని శుద్ది చేస్తారు

ఇక్కడ రోజుకు 200 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయడం ప్రారంభమైంది. ఈ పథకాన్ని దశలవారిగా రోజుకు 440 మిలియన్ లీటర్లు శుద్ధి చేసే విధంగా పూర్తిస్థాయిలో నిర్మించేందుకు పనులను కొనసాగిస్తున్నారు.

పథకాన్ని మేఘా ప్రారంభించడంతో దశలవారిగా 6 క్లష్టర్లలోని 126కు పైగా చెరువులకు నీరిందించాలనే లక్ష్యంలో భాగంగా ప్రస్తుతం లక్ష్మిసాగర్, ఉద్దపనహళ్లి, నర్సాపుర, దొడవాళ్ళభి, భత్తన్కేరే, సింగనహళ్లి తదితర చెరువులకు నీరు అందించడం మొదలైంది. ఈ పథకం క్రింద భూగర్భజలాలు అభివృద్ధి చేయడం ద్వారా ఆయకట్టుకు నీరందించాలనేది లక్ష్యం. గత 3, 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఫలితంగా బావులు, బోర్లు ఎండిపోయాయి. వాటిని పునరుజ్జీవింపచేయడం ద్వారా రైతులు తిరిగి పంటలు పండించుకోవడం సాధ్యమవుతుంది. కరువు నుంచి రైతులను కాపాడే విధంగా శుద్ధిచేసిన బెంగళూరు నగర వ్యర్థ నీరు ఉపయోగపడుతుంది.

ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇదే మొదటిది….

ఈ పథకంలో భాగంగా భూ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా నీటిని సరఫరా చేయాల్సి రావడం వల్ల 6 పంపింగ్ స్టేషన్లను నిర్మించాల్సి వచ్చింది. 6 పంపింగ్ స్టేషన్లకు గాను 3 పంపింగ్ స్టేషన్లు పూర్తిచేసి ఇప్పుడు నీరందిస్తున్నారు. మిగతా పంపింగ్ స్టేషన్లలో కూడా 90 శాతం పని పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.1,342 కోట్లు.

కేసీ వ్యాలీ ప్రాజెక్టుకు విద్యుత్ సమస్య తలెత్తకుండా మేఘా ఇంజనీరింగ్ 6 విద్యుత్ సబ్‌ స్టేషన్లను 66 కేవీ విద్యుత్ వినియోగించేలా ఏర్పాటు చేశారు. కేసీ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 160 నుంచి 2800 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన 23 మోటార్లను ఏర్పాటు చేశారు.

నీటి సరఫరాకు 124 కిలోమీటర్ల పొడవున పైపు లైన్లను బెంగళూరు నగరం నుంచి నిర్మించారు. 2016 నవంబర్‌లో ఈ పని ప్రారంభం కాగా మొదటి దశ ఇప్పటికే పూర్తి చేసి రెండవ దశ పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తం 126 కు పైగా చెరువులకు దశలవారిగా నీరందుతుంది. ఇందుకోసం తాలుకా వారిగా చెరువులను క్లష్టర్లుగా విభజించారు.

బెంగళూరు మెట్రోపాలిటన్ నగరంలోనే అత్యధిక శాతం పనులు చేపట్టవలసి రావడంతో పనులు నిర్వహించడం సవాల్‌గా మారింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి అనేక అనుమతులు తీసుకోవాల్సి రావడం, ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో, ఇరుకైన ప్రాంతాల్లో పనులు చేపట్టాల్సి రావడం, ప్రైవేటు భూములు సేకరించాల్సి రావడం, అకాల వర్షాలు కురవడం లాంటి అనేక ప్రతికూలతలను ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మేఘా ఎదుర్కొంది. అవాంతరాలన్నింటినీ విజయవంతంగా అధిగమించి గడువులోగా పనులను పూర్తిచేసింది.

ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక పైపు లైన్‌లు…

ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని ఆరు తాలుకాల్లోని చెరువులను నింపుతారు. ఇందుకోసం ఆరు అతిపెద్ద పంప్‌ హౌస్‌లను నిర్మించారు. బెంగళూరులోని ప్రధాన రహదారుల వెంబడి, జాతీయ రహదారుల వెంబడి, రైల్వే ట్రాక్ కిందినుంచి సుమారు 124 కిలోమీటర్ల పైప్‌ లైన్ వేశారు. సాధారణంగా ఇనుప పైపులు కొంతకాలానికి తుప్పు పట్టి, భూమిలో కలిసిపోతాయి, ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రత్యేక పైపులను ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించింది. తుప్పు సమస్యను నిరోధించేలా, అధిక నీటి ప్రవాహ ఒత్తిడిని తట్టుకునేలా వీటిని రూపొందించారు.

First Published:  17 Dec 2018 1:40 AM GMT
Next Story