Telugu Global
NEWS

ఈ నెలాఖరులో వైసీపీలో చేరుతున్నా....

ప్రకాశం జిల్లా వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని ఒంగోలులో శనివారం అన్నా రాంబాబు కలిశారు. ఇద్దరూ చాలాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈనెల 17న వైసీపీలో చేరేందుకు సిద్దమని రాంబాబు చెప్పగా… ఆరోజు తాము అందుబాటులో ఉండడం లేదని బాలినేని వివరించారు. దీంతో ఈ నెల 26, లేదా 27 తేదీల్లో జగన్‌ […]

ఈ నెలాఖరులో వైసీపీలో చేరుతున్నా....
X

ప్రకాశం జిల్లా వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని ఒంగోలులో శనివారం అన్నా రాంబాబు కలిశారు. ఇద్దరూ చాలాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈనెల 17న వైసీపీలో చేరేందుకు సిద్దమని రాంబాబు చెప్పగా… ఆరోజు తాము అందుబాటులో ఉండడం లేదని బాలినేని వివరించారు. దీంతో ఈ నెల 26, లేదా 27 తేదీల్లో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరేందుకు అన్నా రాంబాబు నిర్ణయించుకున్నారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అన్నా రాంబాబు.. ఈనెలాఖరు లోపు తాను వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. గిద్దలూరులో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని రాంబాబు చెప్పారు.

ప్రస్తుతం గిద్దలూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఐవీ రెడ్డి ఉన్నారు. అన్నారాంబాబు పార్టీలో చేరితే ఐవీ రెడ్డికి ఎలాంటి అవకాశం ఇస్తారన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

First Published:  15 Dec 2018 11:55 PM GMT
Next Story