Telugu Global
Cinema & Entertainment

ఆ హీరోతోనే సినిమా చేస్తానంటున్న పూరీ జగన్నాధ్

  ఈ ఏడాది తన కొడుకుని హీరోగా పెట్టి “మెహబూబా” అనే సినిమాని తెరకెక్కించాడు పూరీ జగన్నాధ్. ఈ సినిమా కూడా గత సినిమాల్లాగే ఫ్లాప్ అయ్యి కూర్చుంది. ఇక ఇప్పుడు పూరీ జగన్నాధ్ తన తదుపరి సినిమాని రామ్ పోతినేని తో తెరకేక్కించాలి అని ప్లాన్ చేస్తున్నాడు.  ఇది వరకు మాత్రం కేవలం విజయ్ దేవరకొండ హీరోగా ఉంటేనే సినిమా చేస్తాను అని పూరీ జగన్నాధ్ అన్నాడు. ఇక ఇప్పుడు కూడా కేవలం రామ్ ఒక ఆప్షన్ […]

ఆ హీరోతోనే సినిమా చేస్తానంటున్న పూరీ జగన్నాధ్
X

ఈ ఏడాది తన కొడుకుని హీరోగా పెట్టి “మెహబూబా” అనే సినిమాని తెరకెక్కించాడు పూరీ జగన్నాధ్. ఈ సినిమా కూడా గత సినిమాల్లాగే ఫ్లాప్ అయ్యి కూర్చుంది. ఇక ఇప్పుడు పూరీ జగన్నాధ్ తన తదుపరి సినిమాని రామ్ పోతినేని తో తెరకేక్కించాలి అని ప్లాన్ చేస్తున్నాడు. ఇది వరకు మాత్రం కేవలం విజయ్ దేవరకొండ హీరోగా ఉంటేనే సినిమా చేస్తాను అని పూరీ జగన్నాధ్ అన్నాడు.

ఇక ఇప్పుడు కూడా కేవలం రామ్ ఒక ఆప్షన్ మాత్రమే… ఒకవేళ ఈ క్షణాన విజయ్ వచ్చి డేట్స్ ఇస్తే పూరీ జగన్నాధ్ విజయ్ ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. ఇదిలా ఉంటే ఇటివలే విజయ్ దేవరకొండ ఇంకా పూరీ జగన్నాధ్ మీట్ అయ్యారు. మీట్ అయ్యి ఈ విషయం మీదే చర్చించారు అని టాక్. ప్రస్తుతం వరుస కమిట్‌మెంట్లతో విజయ్ దేవరకొండ బిజీగా వున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “డియర్ కామ్రేడ్” చిత్రంలో హీరోగా నటిస్తూ తదుపరి సినిమా స్క్రిప్ట్ పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు విజయ్. అవన్నీ పూర్తి అయిన తరువాత విజయ్ పూరీకి డేట్లివ్వాలి. విజయ్ ఇంత బిజీగా ఉన్నాడు అని తెలిసిన కూడా ఇంకా విజయ్ నే డైరెక్ట్ చేస్తాను అని చెప్పి కూర్చున్నాడు పూరీ జగన్నాధ్.

First Published:  12 Dec 2018 12:19 AM GMT
Next Story