చక్రం వీరుడి దెబ్బకే కాంగ్రెస్ ఓటమి.... మీడియా ఇకనైనా మారాలి....
చంద్రబాబు బరితెగించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేసి ఉంటే తెలంగాణలో గట్టి పోటీ ఇచ్చి ఉండేదన్నారు. ఎప్పుడూ చక్రం తిప్పే మన వీరుడి వల్లే తెలంగాణ కాంగ్రెస్ దెబ్బతినిపోయిందన్నారు. ఏపీలో దోచిన డబ్బుతో కూకట్పల్లిలో గెలిచేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు మీద ఉన్న ప్రజావ్యతిరేకత దెబ్బకు సుహాసిని ఓడిపోయారన్నారు. ఏపీలో కూడా టీడీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు కాచుకుని కూర్చున్నారని కన్నా అభిప్రాయపడ్డారు. […]
చంద్రబాబు బరితెగించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేసి ఉంటే తెలంగాణలో గట్టి పోటీ ఇచ్చి ఉండేదన్నారు. ఎప్పుడూ చక్రం తిప్పే మన వీరుడి వల్లే తెలంగాణ కాంగ్రెస్ దెబ్బతినిపోయిందన్నారు.
ఏపీలో దోచిన డబ్బుతో కూకట్పల్లిలో గెలిచేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు మీద ఉన్న ప్రజావ్యతిరేకత దెబ్బకు సుహాసిని ఓడిపోయారన్నారు. ఏపీలో కూడా టీడీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు కాచుకుని కూర్చున్నారని కన్నా అభిప్రాయపడ్డారు.
చంద్రబాబును ఏకపక్షంగా సపోర్టు చేసే మీడియా సంస్థలు ఇప్పటికైనా ఆలోచన చేసుకుని వ్యవహరించాలన్నారు. చంద్రబాబు అడుగు పెట్టిన వెంటనే తాము టీఆర్ఎస్కు ఓటేయాలని నిర్ణయించుకున్నామని హైదరాబాద్ ప్రజలు తమతో ప్రచార సమయంలో చెప్పారన్నారు కన్నా. ఏపీ ఫలితం చంద్రబాబుకు ఇంతకంటే దారుణంగా ఉంటుందని కన్నా జోస్యం చెప్పారు.